AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Elections: ఇండియా కూటమిలో బయటపడుతున్న లుకలుకలు.. 40 మందితో ఎస్పీ అభ్యర్థుల జాబితా రిలీజ్

భారతీయ జనతా పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పడ్డ ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దింపాలని భావించిన పార్టీలు ఎవరికి వారే అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభర్థులను జాబితాను విడుదల చేసింది సమాజ్ వాదీ పార్టీ.

MP Elections: ఇండియా కూటమిలో బయటపడుతున్న లుకలుకలు.. 40 మందితో ఎస్పీ అభ్యర్థుల జాబితా రిలీజ్
Akhilesh Yadav
Balaraju Goud
|

Updated on: Oct 28, 2023 | 11:09 AM

Share

భారతీయ జనతా పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పడ్డ ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దింపాలని భావించిన పార్టీలు ఎవరికి వారే అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభర్థులను జాబితాను విడుదల చేసింది సమాజ్ వాదీ పార్టీ.

ముంబయి సమావేశంలోన విపక్ష కూటమి ఇండియా.. సాధ్యమైనంత వరకు కలిసి పోటీ చేయాలని తీర్మానం చేసింది. కూటమిలో పార్టీల మధ్య అసెంబ్లీ పార్లమెంటు సీట్ల పంపకాల అంశంపై 14 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి పోరుకు చేయాల్సిన సన్నద్ధతపై ఈ భేటీలో సమాలోచనలు జరిపారు. బీజేపీని గద్దె దింపడమే ఇండియా కూటమి లక్ష్యమని విపక్ష నేతలు స్పష్టం చేశారు. అయితే తాజాగా జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలు ఇండియా కూటమి పార్టీల చిచ్చు రాజేసినట్లు కనిపిస్తోంది. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు విడివిడిగా తమ అభ్యర్థులను ప్రకటించుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే సమాజ్ వాదీ పార్టీ మరో జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 35 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మొరెనా జిల్లాలోని అంబా సురక్షిత్, మొరెనా అసెంబ్లీకి అభ్యర్థులను ప్రకటించారు. మొరెనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాకేష్ కుష్వాహా, అంబా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అనితా సింగ్ చౌదరి బరిలోకి దిగనున్నారు. అర్థరాత్రి వచ్చిన జాబితాలో 40 మంది పేర్లు ఉన్నాయి. వీరిలో 35 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు కాగా, ఐదుగురి టిక్కెట్లు మార్చారు.

సింగ్‌రౌలీలోని దేవ్‌సర్ స్థానం నుంచి డాక్టర్ సుష్మా ప్రజాపతికి సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. అదే సమయంలో సిహౌర్‌లోని అష్టా స్థానం నుంచి అంబరం మాళవియాకు టికెట్ లభించింది. సత్నా జిల్లాలోని సాత్నా అసెంబ్లీ స్థానం నుంచి హాజీ మొయిన్ ఖాన్ బరిలోకి దిగారు. సాత్నాలోని అమర్‌పటన్‌ నుంచి బాలకృష్ణ యాదవ్‌పై సమాజ్‌వాదీ పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఇది కాకుండా పన్నాలోని పావై స్థానం నుంచి రజనీ యాదవ్ పోటీ చేశారు. రిటైర్డ్ IAS అధికారి వినోద్ సింగ్ బఘేల్‌కు అనుప్పూర్‌లోని కొత్మా స్థానం నుండి టిక్కెట్ ఇచ్చింది సమాజ్ వాదీ పార్టీ. కాగా, సంత్ రాజేష్ గిరి గ్వాలియర్‌లోని భిత్వార్ నుంచి పోటీ చేయనున్నారు. దీంతో పాటు జబల్‌పూర్ కాంట్ సీటు నుంచి దేవేంద్ర యాదవ్‌కు, జబల్‌పూర్ నార్త్ సెంట్రల్ స్థానం నుంచి రంజన కుర్మీకి టికెట్ దక్కింది.

కొంత వ్యూహంలో భాగంగా ఛతర్‌పూర్ జిల్లా బిజావర్ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ రేఖ యాదవ్‌కు టికెట్ ఇచ్చింది. గతంలో మనోజ్ యాదవ్ ఇక్కడ నుంచి బరిలోకి దిగారు. గతంలో నివారిలో శివంగి యాదవ్‌ అభ్యర్థిగా బరిలోకి దిగగా, ఇప్పుడు మినీ యాదవ్‌కు టికెట్‌ ఇచ్చారు. మూడవ పేరు పన్నాకు చెందిన గున్నౌర్, వీరిపై జితేంద్ర కుమార్ దహయత్ స్థానంలో అమిత బగ్రీ పేరును ఖరారు చేశారు. రేవాలోని దేవతలాబ్ నుంచి రామయజ్ఞ సోధియా స్థానంలో సీమా జైవీర్ సింగ్ సెంగార్‌కు టిక్కెట్టు ఇచ్చారు. భింద్‌లోని గోహద్ స్థానం నుంచి మోహన్ లాల్ మహోర్ స్థానంలో జితేంద్ర ఖటిక్ అలియాస్ బంటీని ఎస్పీ రంగంలోకి దింపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us