AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Elections: అమిత్ షా రాకతో హీటెక్కిన అసెంబ్లీ పాలిటిక్స్.. మూడు రోజుల పాటు అక్కడే మకాం

అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు. భోపాల్, ఇండోర్, గ్వాలియర్, రేవా ప్రాంతాలకు చెందిన పలువురు నేతలతో హోంమంత్రి సమావేశమవుతారు.

MP Elections: అమిత్ షా రాకతో హీటెక్కిన అసెంబ్లీ పాలిటిక్స్.. మూడు రోజుల పాటు అక్కడే మకాం
Home Minister Amit Shah
Balaraju Goud
|

Updated on: Oct 28, 2023 | 10:31 AM

Share

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు. భోపాల్, ఇండోర్, గ్వాలియర్, రేవా ప్రాంతాలకు చెందిన పలువురు నేతలతో హోంమంత్రి సమావేశం నిర్వహించి ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, హోంమంత్రి అమిత్ షా రోజంతా ఉజ్జయినిలో గడపనున్నారు. ఉజ్జయినిలోని మహాకాల్‌ను ఆయన సందర్శించనున్నారు. దీంతో పాటు హోం మంత్రి షా ఇక్కడ రోడ్ షో చేయనున్నారు.

హోంమంత్రి అమిత్ షా శనివారం అక్టోబర్ 28న సాగర్‌లోని ఖజురహోలో జరిగే సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో 26 అసెంబ్లీ నియోజకవర్గాల అధికారులు, పార్టీ కార్యకర్తలతో హోంమంత్రి షా ఎన్నికల చర్చలు జరపనున్నారు. దీని తర్వాత హోంమంత్రి అమిత్ షా రేవా, షాహదోల్ ప్రాంతాల్లో ఎన్నికల సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం, హోం మంత్రి షా ఉజ్జయిని వెళ్లి అక్కడ మహాకాల్ ఆలయాన్ని సందర్శించి రోడ్ షో చేస్తారు.

మధ్యప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలకు బీజేపీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఎన్నికల కోసం పార్టీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా శుక్రవారం విడుదల చేసింి. కాషాయ పార్టీ నుండి ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో 40 మంది పేర్లు చేర్చారు. ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ , సీఎం శివరాజ్ సహా పలువురు ముఖ్య నేతల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 17న మధ్యప్రదేశ్‌లో ఒకే దశలో ఓటింగ్ నిర్వహించనున్నారు. దీని తర్వాత ఇతర రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కూడా డిసెంబర్ 3న వెలువడనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..