AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abdul Salam: బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో ఒక్క ముస్లిం.. అబ్దుల్ సలామ్ ఎవరో తెలుసా?

లోక్‌సభ ఎన్నికలకు 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ శనివారం విడుదల చేసింది. బీజేపీ తొలి జాబితాలో ఒక్క ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి టికెట్‌ ఇచ్చింది. అతనే కేరళకు చెందిన అబ్దుల్ సలామ్. ఇంతకీ అబ్దుల్ సలామ్ ఎవరు?

Abdul Salam: బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో ఒక్క ముస్లిం.. అబ్దుల్ సలామ్ ఎవరో తెలుసా?
Abdul Salam
Balaraju Goud
|

Updated on: Mar 03, 2024 | 11:33 AM

Share

లోక్‌సభ ఎన్నికలకు 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ శనివారం విడుదల చేసింది. బీజేపీ తొలి జాబితాలో ఒక్క ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి టికెట్‌ ఇచ్చింది. అతనే కేరళకు చెందిన అబ్దుల్ సలామ్. కాలికట్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ అబ్దుల్ సలామ్ కేరళలోని మలప్పురం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. భారతీయ జనతా పార్టీ కేరళలో 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

అబ్దుల్ సలామ్ ఎవరు?

అబ్దుల్ సలాం కేరళలోని తిరుర్ నివాసి. 2019లో బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 135 నెమోమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అబ్దుల్ సలామ్ 2011 నుండి 2015 వరకు కాలికట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అబ్దుల్ 2018 వరకు అధ్యాపక వృత్తిలో కొనసాగారు. అతను 153 పరిశోధనా పత్రాలను వ్రాసాడు, ఇవే కాకుండా 15 సమీక్షా వ్యాసాలు, 13 పుస్తకాలు రాశారు.

అబ్దుల్ సలా‌మ్‌పై ఇప్పటి వరకు ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాకపోవడం విశేషం. ఆయన ప్రకటించిన మొత్తం ఆస్తులు రూ.6.47 కోట్లు. అబ్దుల్ సలామ్ పేరు గురించి గత చాలా రోజులుగా బీజేపీ ఆయనకు టికెట్ ఇస్తుందని చర్చ జరుగుతోంది. తాజాగా బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాతో సస్పెన్స్‌కు తెరపడినట్లు అయ్యింది. అబ్దుల్ ముస్లిం అయినప్పటికీ సెక్యులర్ భావాలు కలిగి వ్యక్తి. అందుకే కేరళలో మైనారిటీ అభ్యర్థిపై బీజేపీ విశ్వాసం వ్యక్తం చేసింది.

195 మంది అభ్యర్థుల్లో 28 మంది మహిళలు

లోక్‌సభ ఎన్నికల తొలి జాబితాలో బీజేపీ 195 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో 50 ఏళ్ల లోపు యువకులు 47 మంది ఉన్నారు. వీరిలో 28 మంది మహిళలు ఉన్నారు. కాగా, 27 మంది షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీ అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చారు. ఇది కాకుండా, 17 మంది ST, 57 మంది అభ్యర్థులు ఇతర వెనుకబడిన తరగతి అంటే OBC వర్గానికి చెందినవారు.

కేరళలో 12 స్థానాలకు అభ్యర్థులు

కస్రావాడ్- ఎంఎల్ అశ్విని

అల్కుజా- శోభా సురేంద్రన్

పతనంతిట్ట అనిల్ ఆంటోని

వడకర – ప్రఫుల్ల కృష్ణ

కోజికోడ్- MT రమేష్

మంగళాపురం- అబ్దుల్ సలామ్

అట్టింగల్-వి మురళీవరణ్ జీ

తిరువనంతపురం: రాజీవ్ చంద్రశేఖర్

కన్నూర్- సి రఘునాథ్

పున్నమి- నివేద సుబ్రమణ్యం

పాలక్కాడ్- సి కృష్ణకుమార్

త్రిసూర్ – సురేష్ గోపీ

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…