Karting SuperSeries: ముగిసిన కొత్త ఫోర్ స్ట్రోక్ కార్టింగ్ సిరీస్.. హైదరాబాద్ వేదికగా మరో రేసింగ్ ఈవెంట్
హైదరాబాద్ వేదికగా మరో రేసింగ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. కొత్త ఫోర్-స్ట్రోక్ కార్టింగ్ సిరీస్ ఏప్రిల్ 29న చెన్నైలో ప్రారంభమై జూన్ 4న హైదరాబాద్లో ముగిసింది.
దేశంలోని కార్టింగ్ ఔత్సాహికుల కోసం సరికొత్తగా ఆరు రౌండ్లలో జరిగిన రేసింగ్ ఈవెంట్ హైదరాబాద్లో ముగిసింది. కొత్త ఫోర్-స్ట్రోక్ కార్టింగ్ సిరీస్ ఏప్రిల్ 29న చెన్నైలో ప్రారంభమై జూన్ 4న హైదరాబాద్లో ముగిసినట్టు రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. హైదరాబాద్లోని చికేన్ సర్క్యూట్ ఈ రేసింగ్ ఈవెంట్ ఫైనల్కు వేదిక అయింది. హైదరాబాద్లో జరిన ఫైనల్లో మొత్తం 6 నగరాల నుంచి 36 మంది డ్రైవర్లు పోటీ పడ్డారు . ఇంకా ఫార్మాట్లో ఒక్కో బ్యాచ్కు తొమ్మిది మంది డ్రైవర్లతో ప్రాక్టీస్, క్వాలిఫైయింగ్ సెషన్ నిర్వహించారు.
ఈ ఫైనల్కి ముందు నాలుగు క్వాలిఫైయింగ్స్ జరిగాయి. ప్రతి రౌండ్లోని టాప్-5 డ్రైవర్లు సెమీ-ఫైనల్కు అర్హత సాధించారు. ప్రతి సెమీ-ఫైనల్ హీట్లో టాప్-5 డ్రైవర్లు హైదరాబాద్లో జరిగిన ఫైనల్లో పోటీ పడగా,,రచిత్ సింగాల్ విజేతగా నిలిచాడు,విజేతగా నిలిచిన రచిత్కి జూలైలో ప్రారంభమయ్యే FMSCI నేషనల్ కార్టింగ్ ఛాంపియన్షిప్ కోసం 2 కోట్ల విలువైన స్కాలర్షిప్లను అందజేస్తారు.
ఈ స్కాలర్షిప్లు ఫ్రీ ఎంట్రీతో పాటు శిక్షణ, కొత్త కార్ట్, మెకానిక్, ఇంజనీర్లను కవర్ చేస్తాయి. హైదరాబాద్ మినహా ప్రతి నగరంలో టాప్-3 విజేతలు ట్రోఫీని పొందుతారు. ఇంకా మొత్తం సిరీస్ నుంచి టాప్-6 డ్రైవర్లు FMSCI నేషనల్ కార్టింగ్ ఛాంపియన్షిప్ కోసం స్కాలర్షిప్ను అందుకుంటారు. చైన్నై, బెంగళూర్, కేరళ, ముంబై, ఢిల్లీలో నిర్వహించిన రేస్ లలో టాప్ 6 ఫైనలిస్టులతో గ్రాండ్ ఫినాలే హైదరాబాద్లో నిర్వహించినట్లు రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అడ్ మేనేజింగ్ డైరెక్టర్ అఖిల్ రెడ్డి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం