AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Kheri Violence: లఖీంపూర్ ఖేరి కేసులో.. జైలు నుంచి విడుదలైన కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా..

Ashish Mishra Released From Jail: దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన లఖీంపూర్ ఖేరి (Lakhimpur Kheri) లో జరిగిన హింసాత్మక ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు

Lakhimpur Kheri Violence: లఖీంపూర్ ఖేరి కేసులో.. జైలు నుంచి విడుదలైన కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా..
Ashish Mishra
Shaik Madar Saheb
|

Updated on: Feb 15, 2022 | 8:23 PM

Share

Ashish Mishra Released From Jail: దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన లఖీంపూర్ ఖేరి (Lakhimpur Kheri) లో జరిగిన హింసాత్మక ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా (Ashish Mishra) కు బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆశిష్ మిశ్రా జైలు నుంచి విడుదలయ్యారు. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ గత వారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై విడుదలకు ముందు నిబంధనల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే విడుదల చేసినట్టు లఖీంపుర్‌ ఖేరి జైలు సూపరింటెండెంట్‌ పీపీ సింగ్‌ తెలిపారు. అయితే.. రూ.3లక్షల చొప్పున ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. నగరం వదిలి వెళ్లే అంశంపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా తన కుమారుడు ఆశిష్ మిశ్రా నివాసానికి చేరుకున్నారు.

లఖింపుర్‌ ఖేరి కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్‌ గత అక్టోబర్‌ మాసంలో అరెస్టయ్యారు. అనంతరం పలుమార్లు బెయిల్‌ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే, ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు మొదలైన రోజే భాజపా నేత ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌ లభించడం గమనార్హం. కాగా.. లఖీంపూర్ కేసులో.. గత అక్టోబర్ 9న ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు విచారించి రిమాండ్‌కు తరలించారు. అయితే పలుమార్లు బెయిల్ నిరాకరించిన కోర్టు గత గురువారం బెయిల్ మంజూరు చేసింది. అయితే.. యూపీ ఎన్నికలు ప్రారంభం రోజే మిశ్రాకు బెయిల్ లభించడంపై పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశాయి.

గత ఏడాది అక్టోబర్ 3న కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలో రైతుల మీదుగా వాహనాలు దూసుకెళ్లడంతో నలుగురు రైతులతోపాటు కారు డ్రైవర్, జర్నలిస్టు, మరో ఇద్దరు కలిపి మొత్తం 8 మంది మృతి చెందారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనాల్లో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా నడుపుతున్నాడనే అభియోగంపై అరెస్టు చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించి చార్జిషీట్ దాఖలు చేసింది.

Also Read:

UP Election 2022: తగ్గేదెలే.. ఉచిత ఎన్నికల తాయిలాల్లో బీజేపీ – ఎస్పీ పోటాపోటీ..

Goa Elections 2022: గోవాలో మరో రాజకీయ సంక్షోభం..! స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..