Karnataka: ఓ విద్యార్థిని పాక్ ఉగ్రవాదితో పోల్చిన కర్ణాటక ప్రొఫెసర్.. సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించిన ఇనిస్టిట్యూట్..

ర్ణాటకలోని ఓ కళాశాల ఉపాధ్యాయుడు తన వద్ద చదువుకునే ముస్లీం విద్యార్థిని ‘కసబ్’ అని సంబోధించాడు. దీంతో ఆగ్రహించిన ఆ విద్యార్థి తన టీచర్‌పై దాడికి పాల్పడ్డాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్

Karnataka: ఓ విద్యార్థిని పాక్ ఉగ్రవాదితో పోల్చిన కర్ణాటక ప్రొఫెసర్.. సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించిన ఇనిస్టిట్యూట్..
Muslim Student Of Institurt
Follow us

|

Updated on: Nov 29, 2022 | 7:58 AM

దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబైలో జరిగిన 2008 26/11 ఉగ్ర దాడుల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ఉగ్రదాడులకు పాల్పడినవారిలో పాకిస్థాన్‌కు చెందిన కసబ్ కూడా ఒకడు. ఈ ఘటనకు పాల్పడినందుకు అతనికి భారత ప్రభుత్వం 2012లో ఉరిశిక్ష విధించింది. ఇప్పుడు కసబ్ గురించి ఎందుకు అనుకుంటున్నారా..? కర్ణాటకలోని ఓ కళాశాల ఉపాధ్యాయుడు తన వద్ద చదువుకునే ముస్లీం విద్యార్థిని ‘కసబ్’ అని సంబోధించాడు. దీంతో ఆగ్రహించిన ఆ విద్యార్థి తన టీచర్‌పై దాడికి పాల్పడ్డాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్  అవుతోంది. దాంతో సదరు ఉపాధ్యాయుడిని  ఆ కళాశాల సస్పెండ్ చేసింది. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడులకు ఈ నెల 26 నాటికి 14 ఏళ్లు. ఆ మరుసటి రోజే కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. ఉడిపిలోని మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శుక్రవారం ఓ  ప్రొఫెసర్ తన విద్యార్థిని అతని పేరు అడిగాడు. ఆ విద్యార్థి  చెప్పిన పేరు ముస్లీం వర్గానికి చెందినది కావడంతో వెంటనే ‘‘ఓహ్, నువ్వు కసబ్ లాగా ఉన్నావు..’’ అని అన్నాడు.

26/11 ముంబై దాడుల తర్వాత సజీవంగా పట్టుబడిన ఏకైక పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్. అతన్ని భారత్ 2012లో ఉరితీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. విద్యార్థి పాటింటే మతాన్ని కించపరచడమేనంటూ కొందరు ఆ ప్రోఫెసర్ మీద మండిపడుతున్నారు. సదరు ప్రొఫెసర్ అతన్ని ‘కసబ్’ అని పిలవగానే ఆ ముస్లీం విద్యార్థి.. “26/11 దాడులు తమాషా విషయం కాదు.. ఈ దేశంలో ముస్లిమ్‌గా ఉండి రోజూ వీటన్నింటిని ఎదుర్కోవడం కూడా తమాషా కాదు సార్. మీరు నా మతం గురించి, అది కూడా ఇంత కించపరిచే విధంగా జోక్ చేశారు. ఇది తమాషా కాదు సార్, కాదు’’ అని అరిచాడు. వెంటనే ఆ ప్రొఫెసర్ తన వ్యాఖ్యను వివాదం కాకుండా చేసేందుకు ప్రయత్నించాడు. ‘‘నువ్వు నా కొడుకులాంటివాడివే..’’ అంటూ విద్యార్థిని శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు ప్రొఫెసర్. దానికి ఆ విద్యార్థి ‘‘మీ కొడుకుతో అలా మాట్లాడతారా? టెర్రరిస్టు అనే పేరుతో పిలుస్తారా?’’ అని బదులిచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఘటనకు  సంబంధించిన వీడియో..

ఆ క్రమంలో ప్రొఫెసర్ తన విద్యార్థికి క్షమాపణలు చెప్పాడు. ఇతర విద్యార్థులు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు. వీడియో వైరల్ కావడంతో, ఇన్స్టిట్యూట్ యాజమాన్యం అతన్ని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ‘‘ మేము ఇప్పటికే ఈ సంఘటనపై విచారణను ప్రారంభించాం. అంతవరకు సదరు ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేశాం. ఈ విధమైన ప్రవర్తనను ఇన్‌స్టిట్యూట్ క్షమించదు. ఇలాంటి ఘటనకు పాల్పడితే ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటున్నాము’’ అని ఇనిస్టిట్యూట్ ఓ ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.