AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఓర్నీ.. పాడుబడ్డ బావిలో బంగారం.. ఏకంగా కేజీల్లో.. ఎలా బయటపడిందంటే..?

కర్ణాటక దావణగెరెలోని హై ప్రొఫైల్ న్యామతి ఎస్బీఐ బ్యాంకు దోపిడి కేసును పోలీసులు ఛేదించారు. దాదాపు రూ.13 కోట్ల విలువైన దొంగిలించబడిన బంగారాన్ని రికవరీ చేశారు. 2024 అక్టోబర్‌లో జరిగిన ఈ దోపిడీలో దాదాపు 17.7 కిలోల బరువున్న తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల దొంగతనం జరిగింది. దావణగెరె జిల్లా పోలీసులు ఐదు నెలల పాటు తీవ్రంగా దర్యాప్తు చేసిన అనంతరం.. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

Viral: ఓర్నీ.. పాడుబడ్డ బావిలో బంగారం.. ఏకంగా కేజీల్లో.. ఎలా బయటపడిందంటే..?
Gold Recovery
Ram Naramaneni
|

Updated on: Mar 31, 2025 | 7:46 PM

Share

కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో న్యామతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో దుండగులు చొరబడి బంగారాన్ని దోచుకున్నారు. దొంగలు కిటికీ ఫ్రేమ్‌ను పగులగొట్టి లోపలికి ప్రవేశించి దాదాపు 13 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకుపోయారు. ఈ దోపిడి 2024 అక్టోబర్‌లో జరిగింది. కట్‌ చేస్తే ఆరు నెలల తరువాత ఆ బంగారం ఓ బావిలో బయటపడింది. అప్పటి నుంచి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాకింగ్‌ నిజాలు తెలిశాయి. లోన్‌ కోసం వచ్చిన ఓ వ్యక్తికి ఆగస్టు 2023లో లోన్‌ రిజెక్ట్‌ చేశారు సదరు ఎస్‌బీఐ బ్రాంచ్ సిబ్బంది. రూ. 15 లక్షల రుణం కోసం పదే పదే అడిగినా బ్యాంక్‌ అధికారులు లోన్‌ ఇచ్చేందుకు ససేమిరా అన్నారు.. అంతే బ్యాంక్‌పై పగబట్టాడు.. ఏదొకటి చేయాలని డిసైడ్‌ అయ్యాడు. తన ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి చాలా జాగ్రత్తగా ఈ దోపిడీకి పథకం వేశాడు.

ఈ క్రమంలో ఆ వ్యక్తి  ఓ గ్యాంగ్‌ని ఏర్పాటు చేసి అదే బ్యాంక్‌కి కన్నం వేసి లాకర్‌లో ఉన్న తాకట్టు బంగారం అంతా మూట కట్టి తీసుకెళ్లారు. పోలీసులకు చిక్కకుండా.. సీసీటీవీ ఫుటేజ్ ఉన్న బ్యాంకు డీవీఆర్‌ను తీసుకెళ్లి పోయారు. దీంతో నిందితులను గుర్తించడం కష్టతరం అయింది.

ఆ మూట తీసుకెళ్లి తమిళనాడులోని మధురై జిల్లాలోని ఉసలంపట్టి సమీపంలో ఉన్న ఓ బావిలో తాడు కట్టి దాచిపెట్టారు. ఆరు నెలల పాటు పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఎట్టకేలకు సాంకేతికత ఆధారంగా కేసును ఛేదించి బావి నుంచి బంగారం రికవరీ చేశారు.  దోపిడీ వెనుక ఉన్న సూత్రధారులు విజయ్‌కుమార్, అజయ్‌కుమార్, అభిషేక, చంద్రు, మంజునాథ్, పరమానందలను అరెస్టు చేశారు. విజయ్‌కుమార్, అజయ్‌కుమార్, వారి బావమరిది పరమానంద తమిళనాడుకు చెందినవారు. వారు న్యామతిలో చాలా సంవత్సరాలుగా మిఠాయిల వ్యాపారం చేస్తున్నారు. మిగిలిన ముగ్గురు నిందితులు కర్నాటకకు చెందినవారు.

ప్రధాన సూత్రధారి సూత్రధారి విజయ్‌కుమార్ ఆరు నెలలకు పైగా దోపిడీకి ప్రణాళిక వేశాడు. మనీ హీస్ట్ వంటి టీవీ సిరీస్‌ల నుండి ప్రేరణ పొంది.. యూట్యూబ్ నుంచి దొంగతనాల గురించి రీసెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ