AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండెలు తరుక్కుపోయే ఘటన.. ఆరేళ్ల కుమారుడిని మొసళ్లు నివసించే కాలువలోకి విసిరిన తల్లి

కర్నాటకలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తల్లి నవ మాసాలు మోసిన కని పెంచిన బిడ్డ పట్ల కర్కశ్యంగా ప్రవర్తించింది. ఆరేళ్ల బిడ్డను మోసళ్ళకు ఆహారంగా వేసింది. ఉత్తర కన్నడలో 32 ఏళ్ల మహిళ తన ఆరేళ్ల కుమారుడిని మొసళ్లు నివసించే కాలువలోకి విసిరింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హత్య ఆరోపణలపై అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

గుండెలు తరుక్కుపోయే ఘటన.. ఆరేళ్ల కుమారుడిని మొసళ్లు నివసించే కాలువలోకి విసిరిన తల్లి
Boy Murder
Balaraju Goud
|

Updated on: May 10, 2024 | 3:42 PM

Share

కర్నాటకలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తల్లి నవ మాసాలు మోసిన కని పెంచిన బిడ్డ పట్ల కర్కశ్యంగా ప్రవర్తించింది. ఆరేళ్ల బిడ్డను మోసళ్ళకు ఆహారంగా వేసింది. ఉత్తర కన్నడలో 32 ఏళ్ల మహిళ తన ఆరేళ్ల కుమారుడిని మొసళ్లు నివసించే కాలువలోకి విసిరింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హత్య ఆరోపణలపై అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటన హలమడి గ్రామంలో చోటుచేసుకుంది. సావిత్రి అనే మహిళ, ఆమె భర్త రవికుమార్ (36) దంపతులకు ఒక కుమారుడు. అయితే తమ కుమారుడు వినోద్‌కు వినికిడి, మాట్లాడే లోపం ఉండటంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత, సావిత్రి రాత్రి 9 గంటల సమయంలో వినోద్‌ను తీసుకుని వెళ్లి మొసళ్ళు ఉండే కాలువలోకి విసిరినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాలువ మొసళ్లతో కూడిన కాళీ నదికి కలుపుతుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు, అగ్నిమాపక దళం డైవర్ల సహాయంతో గాలింపు ప్రయత్నాలకు చీకటి కారణంగా ఆటంకం ఏర్పడింది. రాత్రి కావడంతో వినోద్ మృతదేహం ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు ఉదయం చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది రిస్య్కూ టీమ్. మృతదేహంపై తీవ్రగాయాలు, గాట్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి కుడి చేతిని పాక్షికంగా తిన్న మొసలి దవడల నుండి బాలుడి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఈ ఘటనకు సంబంధించిన పోలీసలు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ఇళ్ళల్లో పనిమనిషిగా పనిచేస్తున్న సావిత్రి, తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న రవికుమార్‌లను కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. తన భర్త మానసికంగా హింసించాడని, తమ కుమారుడి మరణానికి తన భర్త రవికుమార్ కారణమని సావిత్రి ఆరోపించింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్