AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KALIA Scheme: రైతుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్థికంగా ఆదుకునేందుకు కొత్త పథకం

KALIA Scheme: కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు కూడా రైతులకు (Farmers) మేలు చేకూర్చే పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వెన్నుముకగా నిలుస్తున్న అన్నదాతలను ..

KALIA Scheme: రైతుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్థికంగా ఆదుకునేందుకు కొత్త పథకం
Subhash Goud
|

Updated on: May 02, 2022 | 8:53 PM

Share

KALIA Scheme: కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు కూడా రైతులకు (Farmers) మేలు చేకూర్చే పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వెన్నుముకగా నిలుస్తున్న అన్నదాతలను ఆదుకునేందుకు వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇక తాజాగా ఒడిశా (Odisha) రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. దీని ద్వారా రైతులకు అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు వ్యవసాయానికి తోడుగా డబ్బు కొరత రాకుండా సాయంగా నిలుస్తోంది. ఒడిశాలో ఈసారి అక్షయ తృతీయ 2022 (Akshay Tritiya 2022) సందర్భంగా అంటే మే 3వ తేదీన రాష్ట్రంలోని 40 లక్షల మంది రైతులకు జీవనోపాధి, ఆదాయ పెంపుదల కోసం కృషక్ సహాయం కింద అర్హులైన రైతులకు 2000 రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది. కలియా పథకం కింద ఈ ప్రయోజనం రైతులకు అందించబడుతుంది.

మీడియా నివేదికల ప్రకారం.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ సహాయాన్ని విడుదల చేయనున్నారు. కలియా పథకం కింద రాష్ట్రంలోని 40 లక్షల మందికి పైగా చిన్న, సన్నకారు రైతులకు మొత్తం రూ.800 కోట్ల సాయం అందించనున్నారు. ఈ పథకం కింద ప్రతి రైతు డీబీటీ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయనున్నారు.

ప్రతి సంవత్సరం రైతులకు 4000 రూపాయలు ఇస్తున్నారు:

కలియా పథకం కింద ఒడిశాలో అర్హులైన రైతులకు రెండు విడతలుగా ఏటా రూ.4000 అందజేస్తారు. రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి ఒకసారి రబీ పంటకు రూ.2000, ఖరీఫ్ సీజన్‌కు రూ.2000 అందజేస్తున్నారు. దీని ద్వారా రైతులకు సాగు సమయంలో వ్యవసాయానికి ఆర్థిక సహాయం అందుతుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీని కింద రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో ఈ పథకాన్ని వచ్చే మూడేళ్లకు పొడిగించింది.

ఒడిశా రైతులకు రూ.9000 కోట్ల రుణం ఇవ్వాలనే లక్ష్యం..

ఈ ఖరీఫ్ సీజన్‌లో ఒడిశా ప్రభుత్వం వివిధ సహకార సంస్థల సహకారంతో రాష్ట్ర రైతులకు రూ.9000 కోట్ల రుణాలు అందించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలోని రైతులకు ప్రాధాన్యత ఆధారంగా రుణాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ఖరీఫ్‌ సీజన్‌లో సాగుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగా ఎక్కువ రుణాలు అవసరమున్న రైతులను గుర్తించి వారికి రుణాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

PM KISAN Samman Nidhi Yojana: రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్‌ 11వ విడత డబ్బులు.. ఎప్పుడు అంటే..?

Supreme Court: ప్రతి ఒక్కరు కోవిడ్‌ టీకా తీసుకోవాలా? ఆర్టికల్-21 ఏం చెబుతోంది?

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!