ఝార్ఖండ్ ఫలితాలు: 24 ఏళ్లలో.. తొలి ఓటమి

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. జంషెడ్‌పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన స్వతంత్ర్య అభ్యర్థి సరయి రాయ్ చేతిలో 8వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే సరయి రాయ్ బీజేపీ రెబల్ అభ్యర్థి కావడం గమనర్హం. రఘుబర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన రాయ్, ఈ ఎన్నికల్లో తనకు జంషెడ్‌పూర్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే […]

ఝార్ఖండ్ ఫలితాలు: 24 ఏళ్లలో.. తొలి ఓటమి
Follow us

| Edited By:

Updated on: Dec 24, 2019 | 9:25 AM

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. జంషెడ్‌పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన స్వతంత్ర్య అభ్యర్థి సరయి రాయ్ చేతిలో 8వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే సరయి రాయ్ బీజేపీ రెబల్ అభ్యర్థి కావడం గమనర్హం. రఘుబర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన రాయ్, ఈ ఎన్నికల్లో తనకు జంషెడ్‌పూర్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే దానికి బీజేపీ నిరాకరించడంతో ఆయన రెబల్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ముందుగా అనుకున్న జంషెడ్‌పూర్ పశ్చిమ కాకుండా రఘుబర్ పోటీ చేసిన తూర్పు నియోజకవర్గం నుంచి రాయ్ బరిలో దిగి.. ఆయనపై గెలిచారు.

అయితే 1995 నుంచి రఘుబర్ దాస్ జంషెడ్‌పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. ఐదు సార్లు అంటే దాదాపుగా 24సంవత్సరాలు ఆ స్థానంలో ఆయన ఓటమి ఎరగలేదు. ఇక ఈ ఎన్నికల్లో మొదటిసారి పరాజయం చూశారు రఘుబర్. కాగా ఆయనతో పాటు ఆరుగురు మంత్రులు, స్పీకర్ కూడా ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఝార్ఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తోసి జేఏంఎం- కాంగ్రెస్- ఆర్జేడీ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించింది. మొత్తం 81 స్థానాల్లో 47సీట్లను గెలుచుకొని అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది.