AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాతరలో తేనెటీగల బీభత్సం

జాతరలో తేనెటీగల బీభత్సం

Samatha J
|

Updated on: May 05, 2026 | 3:40 PM

Share

వికారాబాద్ జిల్లాలోని రాకంచర్ల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటున్న భక్తులపై అకస్మాత్తుగా తేనెటీగల గుంపు దాడి చేయడంతో భయాందోళనలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి, వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు.

వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో భక్తులు ఎంతో ఉత్సాహంగా పండుగను జరుపుకుంటున్న వేళ విషాదం చోటుచేసుకుంది. ఊహించని విధంగా తేనెటీగల బీభత్సం సృష్టించి, పలువురు భక్తులకు గాయాలయ్యాయి.దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు నరసింహస్వామి ఉత్సవాలకు హాజరయ్యారు. ఉదయం నుండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, చాలా మంది భక్తులు ఆలయ పరిసరాల్లోని చెట్ల కింద సేదతీరుతున్నారు. ఈ క్రమంలో, అకస్మాత్తుగా ఒక పెద్ద తేనెటీగల గుంపు వారిపై దాడి చేసింది. ప్రాణ భయంతో భక్తులు చెల్లాచెదురుగా పరుగులు తీయడంతో, తోపులాటలు జరిగి మరింత మంది గాయపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం :

వైరల్ అవుతున్న సారా అర్జున్‌ లేటెస్ట్ ఫోటో షూట్

టాలీవుడ్‌ లో మళ్లీ మొదలైన థియేటర్ల వివాదం

ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా దేవర సీక్వెల్

ముంచేస్తున్న ఫ్లాప్స్.. రావట్లేదు ఆఫర్స్

Follow Us