AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో 45 డిగ్రీలుదాటిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలో 45 డిగ్రీలుదాటిన ఉష్ణోగ్రతలు

Samatha J
|

Updated on: May 05, 2026 | 4:40 PM

Share

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మెండోరాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జిల్లాను వాతావరణ శాఖ రెడ్ జోన్‌గా ప్రకటించింది. వడదెబ్బకు నలుగురు మృత్యువాత పడ్డారు. వడగాడ్పుల కారణంగా ఉపాధి హామీ కూలీలు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యులు మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.

తెలంగాణలో ఎండలు తీవ్ర రూపాన్ని దాల్చాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది, ఇక్కడ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా మెండోరాలో ఏకంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ నిజామాబాద్ జిల్లాను రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఎండల తీవ్రతతో ప్రజలు, ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు, రైతులు, ఆటో డ్రైవర్లు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.వడదెబ్బ కారణంగా జిల్లాలో ఇప్పటికే నలుగురు మృత్యువాత పడ్డారు. మధ్యాహ్నం 11 గంటల తర్వాత రోడ్లపై జనం కనిపించడం లేదు. సాయంత్రం 5 గంటల తర్వాతే బయటకు వస్తున్నారు. వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

వైరల్ అవుతున్న సారా అర్జున్‌ లేటెస్ట్ ఫోటో షూట్

టాలీవుడ్‌ లో మళ్లీ మొదలైన థియేటర్ల వివాదం

ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా దేవర సీక్వెల్

ముంచేస్తున్న ఫ్లాప్స్.. రావట్లేదు ఆఫర్స్

Follow Us