నంద్యాల మండలం చాపిరేవులలో ఓ వివాహ వేడుక విషాదంగా మారింది. సోదరి పెళ్లిలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ప్రదీప్ అనే యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల సిపిఆర్ ప్రయత్నాలు ఫలించలేదు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.