పాకిస్తాన్ కాల్పుల్లో.. భారత జవాన్ మృతి
పాక్ వరుస దుశ్చర్యలకు పాల్పడుతోంది. తాజాగా మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంగించింది. ఈ దాడిలో భారత జవాన్ మృతి చెందగా.. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. జమ్మూకాశ్మీర్లోని బారాముల్లాలోని రాంపూర్ సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల విమరణ...
పాక్ వరుస దుశ్చర్యలకు పాల్పడుతోంది. తాజాగా మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంగించింది. ఈ దాడిలో భారత జవాన్ మృతి చెందగా.. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. జమ్మూకాశ్మీర్లోని బారాముల్లాలోని రాంపూర్ సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల విమరణ ఉల్లంఘించింది పాకిస్తాన్. అదేవిధంగా పాక్ కాల్పులకు కూడా భారత సైనికులు ధీటుగా సమాధానం ఇచ్చారు. కాగా ఈ నెలలో పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో సైనిక స్థావరాలు, గ్రామాలనే లక్ష్యంగా పాకిస్థాన్ దళాలు కాల్పులు చేస్తున్నాయి. ఇప్పటివరకూ ముగ్గురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జూన్ 4న రాజౌరి జిల్లాలోని సుందర్ బనీ సెక్టార్ ఒకరు, జూన్ 10న అదే జిల్లాలో జరిపిన దాడుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు.
Read More:
తెలంగాణ సచివాలయంలో మరో కరోనా కేసు.. ఉలిక్కిపడుతోన్న ఉద్యోగులు
తెరుచుకున్న శబరిమల ఆలయం.. కానీ భక్తులకు నో ఎంట్రీ..