AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: రూ.35 కోసం ఐదేళ్ల పోరాటం.. దెబ్బకు దిగొచ్చిన రైల్వే శాఖ..

Indian Railway: రూ. 35 రిఫండ్ కోసం ఇండియన్ రైల్వే డిపార్ట్‌మెంట్‌తో ఐదేళ్లు పోరాటం చేశాడు ఓ వ్యక్తి. చివరకు తన పోరాటం ఫలించింది. రైల్వే శాఖ దిగొచ్చింది.

Indian Railway: రూ.35 కోసం ఐదేళ్ల పోరాటం.. దెబ్బకు దిగొచ్చిన రైల్వే శాఖ..
Irctc
Shiva Prajapati
|

Updated on: May 31, 2022 | 9:07 AM

Share

Indian Railway: రూ. 35 రిఫండ్ కోసం ఇండియన్ రైల్వే డిపార్ట్‌మెంట్‌తో ఐదేళ్లు పోరాటం చేశాడు ఓ వ్యక్తి. చివరకు తన పోరాటం ఫలించింది. రైల్వే శాఖ దిగొచ్చింది. అతని రూ.35 రూపాయలు అతనికి తిరిగి ఇచ్చేసింది. అంతేకాదు.. అతని చేసిన పోరాటం.. 2.98 లక్షల మందికి సహాయపడింది. మనం బస్సుల్లోనో, ఆటోలోనో ప్రయాణం చేస్తున్నప్పుడు చిల్లర లేదనే కారణంతో ఎంతో కొంత డబ్బులు వదులకోవాల్సి వస్తుంది. కానీ, కొందరు మాత్రం జిద్దుగా ఉంటారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలంటే ఇవ్వాలని పట్టుబడతారు. ఇక మరికొన్ని సందర్భాల్లో రైలు, బస్సు, సినిమా టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు సర్వీస్ ఛార్జీలు, ఇతరాల పేరుతో ఎంతోకొంత కట్ చేస్తుంటారు. చాలా మంది వాటిని లైట్ తీసుకుంటారు. కొద్ది మంది మాత్రమే వాటిని సీరియస్‌గా తీసుకుంటారు. అసలు ఎందుకు కట్ అయ్యింది? దాని అసలు కథ ఏంటనే దానిపై లోతుగా పరిశోధిస్తారు.

రాజస్థాన్‌కు చెందిన ఓ యువ ఇంజనీర్ సుజీత్ కూడా అలాగే చేశాడు. సుజీత్ స్వామి(30) ఢిల్లీ నుంచి గోల్డెన్ టెంపుల్ వెళ్లడానికి 2017, ఏప్రిల్‌లో ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆ తరువాత ఏవో కారణాల చేత తన టికెట్‌‌ను క్యాన్సల్ చేసుకున్నాడు. అయితే, 2017 జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రాగా, అంతకు ముందే అతను టికెట్ క్యాన్సిల్ చేసుకున్నప్పటికీ.. జీఎస్టీ, సర్వీస్ ఛార్జెస్ పేరుతో రూ. 35 ఎక్కువ కట్ చేసుకుంది రైల్వే శాఖ. దీనిని సీరియస్‌గా తీసుకున్న సుజీత్.. రూ. 35 కోసం ఐదేళ్లుగా ఆర్టీఐ దరఖాస్తులతో రైల్వే శాఖను ఊపిరి సలపకుండా చేశాడు. అతని దెబ్బకు దిగొచ్చిన రైల్వే.. సుజీత్‌కు రూ.35 రిఫండ్ చేసింది. అంతేకాదు.. అతని మాదిరిగానే ఛార్జీల పేరుతో 2.98 లక్షల మందికి కట్ చేయగా.. వారందరికీ రిఫండ్ ఇచ్చింది రైల్వే శాఖ. 2.98 లక్షల మందికి రూ. 35 చొప్పున మొత్తం రూ.243 కోట్లను రిఫండ్ చేసింది. అయితే, సుజీత్ తనకు రావాల్సిన 35 రూపాయల కోసం పోరాటం చేసి.. ఏకంగా 2.98 లక్షల మందికి సహాయం చేశాడు.