Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Betting Apps: ఇక నుంచి బెట్టింగ్ యాప్స్ యాడ్స్ ప్రసారం చేస్తే కఠిన చర్యలు.. హెచ్చరించిన కేంద్రప్రభుత్వం

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కు సబంంధించిన ప్రకటనలపై నిషేధం ఉన్నప్పటికి అటువంటి ప్రకటనలను కొన్ని మీడియా సంస్థలు, వెబ్ సైట్లు, ఓటీటీ ప్లాట్ ఫాంలు అటువంటి ప్రకటనలు ప్రసారం చేయడంపై కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం..

Betting Apps: ఇక నుంచి బెట్టింగ్ యాప్స్ యాడ్స్ ప్రసారం చేస్తే కఠిన చర్యలు.. హెచ్చరించిన కేంద్రప్రభుత్వం
Sports Betting Apps (file P
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 03, 2022 | 10:46 PM

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కు సబంంధించిన ప్రకటనలపై నిషేధం ఉన్నప్పటికి అటువంటి ప్రకటనలను కొన్ని మీడియా సంస్థలు, వెబ్ సైట్లు, ఓటీటీ ప్లాట్ ఫాంలు అటువంటి ప్రకటనలు ప్రసారం చేయడంపై కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి వాటిని ప్రసారం చేయకూడదని సూచించింది. ఈమేరకు డిజిటల్ మీడియా సంస్థలు, ఓటీటీలు, టీవీ ఛానెళ్లకు అక్టోబర్ 3వ తేదీ సోమవారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది. ఇప్పటికీ కొన్ని ఛానెళ్లు, మీడియా, ఆన్‌లైన్‌ సంస్థలు బెట్టింగ్ యాప్ లకు సంబంధించిన ప్రకటనలను ప్రసారం చేయడం తాము గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇకపై ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన యాడ్స్ ప్రసారం చేయకుండా నియంత్రణ పాటించాలని సూచించింది. కొన్ని ఆన్‌లైన్‌ బెట్టింగ్ సంస్థలు తమ ప్రచారం కోసం న్యూస్ వెబ్‌సైట్లను వాడుకుంటున్నాయని, ఈ ప్రకటనలపై నిషేధం విధిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్‌పై దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే నిషేధం కూడా ఉంది. అయినా ఈ సంస్థలు తమ గేమ్స్‌ను ప్రొఫెషనల్ క్రీడల్లాగా ప్రకటించుకుంటున్నాయి. న్యూస్ వెబ్‌సైట్లు, ఛానెళ్లను ఈ సంస్థలు తమ ప్రకటనల కోసం వాడుకుంటున్నాయి. ఇకపై వీటిని ప్రసారం చేయకూడదని, ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రప్రభుత్వం హెచ్చరించింది.

ఇటీవల కాలంలో ఎక్కువ మంది, ముఖ్యంగా యువత వివిధ వెబ్ సైట్లు, ఓటీటీ ప్లాట్ ఫాంలకు సంబంధించిన యాప్ లను ఎక్కువుగా వినియోగిస్తున్నారు. దీంతో వీటిలో వచ్చే యాడ్స్ పట్ల కూడా వారు ఆకర్షితులై.. జూద క్రీడలకు అలవాటుపడే ప్రమాదం ఉందని గుర్తించిన కేంద్రప్రభుత్వం ఇటువంటి బెట్టింగ్ యాప్ యాడ్స్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రకటనలను ప్రచురించకూడదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2022 జూన్ 13 వ తేదీన వార్తా సంస్థలు, ప్రయివేట్ టీవీ ఛానెల్స్ఓ, డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ కు సూచించింది. అయినా సరే ఇంకా ఈ బెట్టింగ్ యాప్ లకు సంబంధించిన యాడ్స్ ప్రసారం కావడాన్ని కేంద్రప్రభుత్వం సిరీయస్ గా తీసుకుంది. ఈ మేరకు అలాంటి యాడ్స్ ప్రసారం చేయవద్దంటూ హెచ్చరించింది. ఫెయిర్ ప్లే, బెట్ వే, వన్ ఎక్స్ బెట్ వంటి ఆఫ్ షోర్ బెట్టింగ్ యాప్ లు ఇప్పటికి తమ ప్రకటనలను ఇస్తుండగా.. చాలా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి. దీంతో ఇటువంటి ప్రకటనలపై నిషేధం ఉందని, ప్రసారం చేయకూడదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

కర్రెగుట్టలపై రెండు రోజులుగా బాంబుల వర్షం!
కర్రెగుట్టలపై రెండు రోజులుగా బాంబుల వర్షం!
రూ.345తో 60 రోజుల వ్యాలిడిటీ.. ఉత్తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌..!
రూ.345తో 60 రోజుల వ్యాలిడిటీ.. ఉత్తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌..!
ఐపీఎల్‌లో కామెంటరీ.. కట్ చేస్తే.. పీఎస్‌ఎల్‌లో ప్లేయర్‌.. ఎవరంటే?
ఐపీఎల్‌లో కామెంటరీ.. కట్ చేస్తే.. పీఎస్‌ఎల్‌లో ప్లేయర్‌.. ఎవరంటే?
కొత్త హీరోయిన్స్ ఆ హీరో బెడ్ ఎక్కాల్సిందే..
కొత్త హీరోయిన్స్ ఆ హీరో బెడ్ ఎక్కాల్సిందే..
వేసవిలో పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికి కూడా మస్తు డిమాండ్
వేసవిలో పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికి కూడా మస్తు డిమాండ్
బెట్టింగ్‌ యాప్స్‌ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!
బెట్టింగ్‌ యాప్స్‌ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!
పాన్‌ కార్డుకు గడువు ఉంటుందా..? మరణించిన వ్యక్తి కార్డ్ ఏమవుతుంది
పాన్‌ కార్డుకు గడువు ఉంటుందా..? మరణించిన వ్యక్తి కార్డ్ ఏమవుతుంది
'నీకు చేతనైనది చేసుకో..': పీఓకే ప్రధాని అన్వరుల్
'నీకు చేతనైనది చేసుకో..': పీఓకే ప్రధాని అన్వరుల్
పల్లీలు, నువ్వులు కలిపి తింటున్నారా..? మీ శరీరంలో కలిగే మార్పులు
పల్లీలు, నువ్వులు కలిపి తింటున్నారా..? మీ శరీరంలో కలిగే మార్పులు
బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్‌ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్
బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్‌ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్