AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Tracks: రైల్వే ట్రాక్‌ అనుమానస్పద వస్తువు.. రైలుకు సడెన్‌ బ్రేక్‌.. దాన్ని చూసి షాకైన డ్రైవర్‌

ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు ఆకతాయిలు రైలు పట్టాలపై వివిధ వస్తువులనే ఉంచుతూ ప్రమాదాలు జరిగేలా చేస్తున్నారు. రైలు ప్రమాదాలు పెరుగుతుండటంతో ప్రయాణికుల్లో ఆందోళన పెరుగుతోంది. కొందరు రైలు పట్టాలపై పడుకోవడం, రాళ్లను ఉంచడం లాంటివి చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది...

Railway Tracks: రైల్వే ట్రాక్‌ అనుమానస్పద వస్తువు.. రైలుకు సడెన్‌ బ్రేక్‌.. దాన్ని చూసి షాకైన డ్రైవర్‌
Subhash Goud
|

Updated on: Sep 30, 2024 | 8:14 AM

Share

ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు ఆకతాయిలు రైలు పట్టాలపై వివిధ వస్తువులనే ఉంచుతూ ప్రమాదాలు జరిగేలా చేస్తున్నారు. రైలు ప్రమాదాలు పెరుగుతుండటంతో ప్రయాణికుల్లో ఆందోళన పెరుగుతోంది. కొందరు రైలు పట్టాలపై పడుకోవడం, రాళ్లను ఉంచడం లాంటివి చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రైల్వే ట్రాక్‌పై మరోసారి అనుమానాస్పద వస్తువు కనిపించింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లోని లోకో పైలట్ ట్రాక్‌పై ఎర్రటి సిలిండర్‌ను గమనించి, సకాలంలో బ్రేకులు వేసాడని పోలీసులు తెలిపారు. సిలిండర్‌కు కొంత దూరంలో రైలు ఆగిందని పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని రైల్వే ట్రాక్‌లపై గ్యాస్ సిలిండర్లు, కాంక్రీట్ స్తంభాలు గుర్తించిన అనేక కేసుల తర్వాత తాజాగా మరో కేసు వెలుగు చూడటంతో అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.మధ్య ఇది తాజాది కాబట్టి ఈ సంఘటన ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ముంబై నుండి లక్నో వెళ్తున్న రైలు గోవింద్‌పురి స్టేషన్ సమీపంలోని హోల్డింగ్ లైన్‌కు చేరుకోగా, ఆదివారం సాయంత్రం 4.15 గంటలకు పట్టాలపై పడి ఉన్న ఫైర్ సేఫ్టీ సిలిండర్‌ను డ్రైవర్‌ చూసి షాక్‌ అయ్యాడు. రైలు వేగం తక్కువగా ఉందని, దీంతో పెను ప్రమాదం తప్పిందని డ్రైవర్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఈ విషయాన్ని కంట్రోల్ రూమ్‌కు తెలియజేయడంతో డ్రైవర్ సిలిండర్‌ను కాన్పూర్ సెంట్రల్‌కు తీసుకొచ్చాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నిన్న, బందా-మహోబా రైలు ట్రాక్‌పై ఫెన్సింగ్ పిల్లర్‌ను ఉంచి అంతరాయం కలిగించినందుకు 16 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్యాసింజర్ రైలు పట్టాలపై కాంక్రీట్ పిల్లర్‌ను చూసిన డ్రైవర్ రైలును ఆపడానికి అత్యవసర బ్రేకులు వేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?