AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 4th Wave: భారత్‌లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. భారీగా పెరిగిన కేసులు.. నిన్న ఎన్నంటే..?

ఈ మహమ్మారి (Covid-19) కారణంగా దేశవ్యాప్తంగా 8 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

Covid 4th Wave: భారత్‌లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. భారీగా పెరిగిన కేసులు.. నిన్న ఎన్నంటే..?
Coronavirus
Shaik Madar Saheb
|

Updated on: Jun 09, 2022 | 10:31 AM

Share

Coronavirus 4th wave in India: దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు.. మళ్లీ పెరుగుతుండటం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. బుధవారం 7,240 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే (5,233) కేసుల సంఖ్య 2007 పెరిగాయి. దీంతోపాటు ఈ మహమ్మారి (Covid-19) కారణంగా దేశవ్యాప్తంగా 8 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దాదాపు మూడు నెలల తర్వాత రోజువారీ కేసుల సంఖ్య 7 వేల మార్క్ దాటింది. మార్చి నెల తర్వాత అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. మంగళవారంతో పోలిస్తే.. 40 శాతం కేసులు పెరిగాయి.

ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 32,498 కి పెరిగినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.08 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో దేశంలో మొత్తం 3,591 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ రేటు దాదాపు 98.71 శాతానికి చేరుకుంది.

ఇవి కూడా చదవండి
  • దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య – 4,31,97,522
  • కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య – 4,26,40,301
  • దేశంలో మరణాల సంఖ్య 5,24,723 కి చేరింది.

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 194.59 కోట్ల డోసులను పంపిణీ చేశారు. నిన్న 15,43,748 మందికి టీకాలు ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..