Uttar Pradesh: తనలాగే ఉన్న అమ్మాయిని చంపి.. తానే చనిపోయినట్లు నమ్మించి.. రీల్ సీన్ కానే కాదండోయ్..

స్మాల్ స్క్రీన్ పై ప్రసారమయ్యే సీఐడీ సీరియల్‌ ఎంత పాపులారిటీ సాధించిందో అందరికీ తెలిసిందే. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది ఈ సీరియల్.ఇందులో రకరకాల క్రైమ్‌ థ్రిల్లర్‌ స్టోరీస్ ఎంతో..

Uttar Pradesh: తనలాగే ఉన్న అమ్మాయిని చంపి.. తానే చనిపోయినట్లు నమ్మించి.. రీల్ సీన్ కానే కాదండోయ్..
SI Arrested
Follow us

|

Updated on: Dec 03, 2022 | 12:27 PM

స్మాల్ స్క్రీన్ పై ప్రసారమయ్యే సీఐడీ సీరియల్‌ ఎంత పాపులారిటీ సాధించిందో అందరికీ తెలిసిందే. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది ఈ సీరియల్.ఇందులో రకరకాల క్రైమ్‌ థ్రిల్లర్‌ స్టోరీస్ ఎంతో ఉత్కంఠబరితంగా సాగుతాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే… అచ్చం అలాంటి సీన్‌ ఒకటి ఉత్తరప్రదేశ్‌లో రియల్‌గా జరిగింది. పాత కక్షల నేపధ్యంలో తనలాంటి అమ్మాయిని చంపేసి, తనే చనిపోయినట్లుగా క్రియేట్‌ చేసి ప్రియుడితో కలిసి మరో మర్డర్‌ కోసం ప్లాన్‌ చేసింది. అయితే అదికాస్తా బెడిసికొట్టి జైలు పాలయ్యింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం పదండి.. కట్ చేస్తే.. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన పాయల్‌ భాటి అనే 22 రెండేళ్ల యువతి, తన ప్రియుడు అజయ్‌ ఠాకూర్‌తో కలిసి.. అచ్చం పాయల్‌ పోలికలతో ఉండే అమ్మాయితో స్నేహం చేశారు. హేమ అనే ఈ అమ్మాయి స్థానికంగా ఉండే ఓ మాల్‌లో పనిచేస్తోంది. పథకం ప్రకారం పాయల్‌, హేమను ఇంటికి పిలిచింది. అనంతరం ప్రియుడితో కలిసి ఆమె గొంతు నులిమి హత్య చేసింది.

ఆ తర్వాత ఆమె ముఖం, గొంతుపై వేడి నూనె పోసింది. ఆ తర్వాత హేమ మృతదేహానికి పాయల్‌ దుస్తులు వేశారు. అనంతరం తనే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తూ.. ‘వంట చేస్తుండగా.. నా ముఖం కాలిపోయింది. నాకింక బతకాలని లేదు’ అంటూ ఓ సూసైడ్‌ నోట్‌ రాసి అక్కడ పెట్టి, ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. సూసైడ్‌ నోట్‌ చూసి చనిపోయింది పాయలే అని భావించిన ఆమె బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు.. చనిపోయిన యువతి కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదంటూ నవంబర్‌ 12న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. పాయల్ తల్లిదండ్రులు ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నారని, తన తల్లిదండ్రుల మరణానికి సోదరుడి అత్తింటి వారితో పాటు ఓ బంధువు కారణమని భావించిన పాయల్‌ వారిని చంపేందుకు ఇంతటి స్కెచ్‌ వేసిందని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం ముందుగా తను ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించింది. తర్వాత ప్రియుడితో కలిసి పారిపోయింది. అనంతరం వారిని హత్య చేసేందుకు నాటు తుపాకీ, కత్తి సైతం కొనుగోలు చేశారని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..