AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

vaccination: ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధరలు ఇలా..! రేటును నిర్ణయించిన కేంద్రం.. ఏ టీకా ధర ఎంతంటే..!

Private Vaccination Centers:

vaccination: ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధరలు ఇలా..! రేటును నిర్ణయించిన కేంద్రం.. ఏ టీకా ధర ఎంతంటే..!
vaccination
Sanjay Kasula
|

Updated on: Jun 08, 2021 | 10:03 PM

Share

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా కొనసాగిస్తున్న భారత ప్రభుత్వం.. వ్యాక్సిన్ ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ టీకా కేంద్రాల్లో సవరించిన ధరల ప్రకారం కోవిషీల్డ్ రూ .780 కు, కోవాసిన్ రూ. 1,410 లభిస్తుంది. అదే సమయంలో, స్పుత్నిక్ ధరను కూడా రూ. 1,145 తగ్గించింది.

దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. దేశంలోని వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు తయారు చేసే వ్యాక్సిన్లలో 25 శాతం ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేయొచ్చని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రైవేటు ఆస్పత్రులకు విక్రయించే వ్యాక్సిన్ ధరలను ఖరారు చేసింది.

ఉత్పత్తిదారులు ప్రకటించినట్టుగానే కోవిషీల్డ్ రూ. 780, కోవాగ్జిన్ రూ. 1410, స్పుత్నిక్ వి రూ. 1145 కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది. ఇక వ్యాక్సిన్ కంపెనీలు ఉత్పత్తి చేసే టీకాల్లో 75 శాతాన్ని కేంద్రమే నేరుగా కొనుగోలు చేయనుంది. వాటిని రాష్ట్రాలకు ఉచితంగా ఇవ్వనుంది.

వ్యాక్సినేషన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ఖరారు చేసిన కేంద్రం.. జులై 21 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి తీసుకురాబోతోంది. జనాభా, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే రాష్ట్రాలకు వ్యాక్సిన్ కేటాయింపులు ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది.

ప్రైవేటు రంగాలకు, ఆసుపత్రులకు కోవిడ్ -19 వ్యాక్సిన్ల ధరను టీకా తయారీదారులు నిర్ణయిస్తారని మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రైవేటు రంగం నుండి వచ్చిన డిమాండ్‌ను రాష్ట్రాలు సమకూరుస్తాయని, అంటే తమ వద్ద ఉన్న సౌకర్యాల నెట్‌వర్క్‌ను, దానికి అవసరమైన మోతాదును వారు పర్యవేక్షిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బయాలాజికల్-ఈ సంస్థ తయారు చేస్తున్న కోర్బీవ్యాక్స్ టీకా ధర ఎంత ఉంటుందనే విషయంపై ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. దేశంలోనే అత్యంత చవుకగా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోందంటూ ఇప్పటికే ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ వ్యాక్సిన్ ధరపై నీతి ఆయోగ్ స్పందించింది. నీతీ ఆయోగ్ ఆరోగ్య శాఖ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మంగళవారం దీనిపై మీడియాతో మాట్లాడారు.