Flames from Borewell: బోర్ వెల్ నుంచి మంటలు.. 22 రోజులు గడిచినా ఆగలేదు.. ప్రమాదం లేదంటున్న ఓఎన్జీసీ అధికారులు!

మధ్యప్రదేశ్ రాష్ట్రం గునూరు మున్సిపల్ కౌన్సిల్‌కు ఆనుకుని ఉన్న ఝుమ్టాలోని మిడిల్‌ స్కూల్‌ ఎదురుగా ఉన్న బోరుబావిలో మంటలు చెలరేగి 22 రోజులు గడిచినా ఇంకా చల్లారలేదు.

Flames from Borewell: బోర్ వెల్ నుంచి మంటలు.. 22 రోజులు గడిచినా ఆగలేదు.. ప్రమాదం లేదంటున్న ఓఎన్జీసీ అధికారులు!
Flemes From Borewell
Follow us

|

Updated on: Nov 10, 2021 | 11:32 AM

Flames from Borewell: మధ్యప్రదేశ్ రాష్ట్రం గునూరు మున్సిపల్ కౌన్సిల్‌కు ఆనుకుని ఉన్న ఝుమ్టాలోని మిడిల్‌ స్కూల్‌ ఎదురుగా ఉన్న బోరుబావిలో మంటలు చెలరేగి 22 రోజులు గడిచినా ఇంకా చల్లారలేదు. భద్రత దృష్ట్యా, ఈ బోర్ వెల్ పై ఒక పైపు అమర్చారు. దీని నుంచి గ్యాస్ బయటకు వచ్చి మండుతోంది. ఇది చూడటానికి మంటతో ఉన్న గొట్టంలా కనిపిస్తోంది. దీంతో పాటు ఆ చుట్టుపక్కల దాదాపు డజను ఇతర బోర్‌వెల్‌ల నుండి గ్యాస్ లీక్ సమాచారం కూడా వెలుగులోకి రావడంతో, ఓఎన్జీసీ(ONGC) బృందం విచారణ కోసం గురువారం జుమ్టా గ్రామానికి తిరిగి రానుంది.

పరిస్థితిని పరిశీలించేందుకు ఝుమ్టా చేరుకున్న కలెక్టర్ సంజయ్ మిశ్రా మాట్లాడుతూ, ఝుమ్టాతో సహా అమన్‌గంజ్ ప్రాంతాన్ని ఇప్పటికే ఓఎన్జీసీ సర్వే లక్ష్యంలో చేర్చినట్లు చెప్పారు. సహజ వాయువు, చమురు ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టు భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ ఘటన తర్వాత దర్యాప్తు ముమ్మరం చేశారు. పెద్ద బృందాన్ని పంపాలని ఎంపీ వీడీ శర్మ ఫ్రాంటియర్ బేసిన్ చీఫ్ జనరల్ మేనేజర్‌కు లేఖ రాశారని ఆయన చెప్పారు. అందుకోసం నవంబర్ 11న వచ్చే బృందం విచారణతో పాటు ఆ ప్రాంతంలో సర్వే పనులు చేయనుంది.

20 అడుగుల ఎత్తైన పొయ్యి..

ఝుమ్టా గ్రామంలోని డజనుకు పైగా బోరుబావుల నుంచి మండే గ్యాస్ లీక్ అవుతోంది. అక్టోబర్ 18 నుండి మిడిల్ స్కూల్ ఝుమ్టా దగ్గర ఒక బోరింగ్ కాలిపోతోంది. దీనిలో ఓఎన్జీసీ బృందం సుమారు 20 అడుగుల ఎత్తైన చిమ్నీని ఏర్పాటు చేసింది. రెండవ బోరింగ్ మంటలు చెలరేగి ఒక వారం కంటే ఎక్కువ సమయం గడిచింది. గ్రామంలోని మరో రెండు-మూడు బోర్‌వెల్‌లు కూడా దగ్ధమయ్యాయి. గ్యాస్ లీక్ కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలోని ప్రజలు తాగునీటికి సైతం ఇబ్బందులు పడుతున్నారు. బోర్‌వెల్‌ నుంచి నాలుగు రకాల గ్యాస్‌ లీక్‌..

జుమ్టా గ్రామంలో ఏర్పాటు చేసిన చౌపాల్‌లో ఓఎన్‌జీసీ బృందం నమూనాలు సేకరించినట్లు కలెక్టర్ కె.మిశ్రా తెలిపారు. ఈ నమూనాల పరిశోధనలో బోర్‌వెల్ నుంచి నాలుగు రకాల వాయువులు వెలువడుతున్నాయని ఓఎన్‌జీసీ అధికారులు చెబుతున్నారు. ఈ వాయువులు ఆక్సిజన్‌తో తాకినప్పుడు మాత్రమే మండుతాయి. దీని వల్ల భూమి లోపల మంటలు చెలరేగే అవకాశం లేదని వారంటున్నారు.

ఇవి కూడా చదవండి: Cinema after Corona: కరోనా తరువాత ఈ సినిమాలు కోట్లు కొల్లగొట్టి రికార్డులు సృష్టించాయి.. అవేమిటో తెలుసా?

Sleeping Time: మన నిద్రకూ గుండెపోటుకు మధ్య సంబంధం ఉంది.. రాత్రి ఎక్కువ సమయం మేల్కొంటే ఏం జరుగుతుందంటే..

Weight Loss: బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోనవసరం లేదు.. చక్కని తిండి తింటూనే స్లిమ్‌గా కావొచ్చు..ఎలా అంటారా?