AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwini Vaishnaw: ప్రత్యేక రైళ్ల పర్యవేక్షణకు వార్ రూమ్.. వివరాలు వెల్లడించిన అశ్విని వైష్ణవ్

పండుగ సీజన్‌లో స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీని సమర్థవంతంగా, సజావుగా నిర్వహించేలా డివిజనల్, జోనల్, రైల్వే బోర్డు స్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు.  రైల్ భవన్‌లోని వార్ రూమ్‌లో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఈ కథనంలో...

Ashwini Vaishnaw: ప్రత్యేక రైళ్ల పర్యవేక్షణకు వార్ రూమ్.. వివరాలు వెల్లడించిన అశ్విని వైష్ణవ్
Ashwini Vaishnaw
Ram Naramaneni
|

Updated on: Oct 23, 2025 | 8:10 PM

Share

పండుగల సమయంలో ప్రయాణీకులకు సేవలందించడానికి రైల్వేలు ప్రత్యేక రైళ్లను నడుపుతాయి. దీని కారణంగా పట్టాలపై రైళ్ల రద్దీ పెరుగుతుంది.  దీని ఫలితంగా చాలా రైళ్లు ఆలస్యం అవుతాయి. ఈ క్రమంలోనే రైల్వేలు ప్రయాణీకుల రద్దీని పర్యవేక్షించడానికి రైల్ భవన్‌లో వార్ రూమ్‌ను ఏర్పాటు చేశాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వార్ రూమ్‌ను పరిశీలించి వార్ రూమ్ గురించి సమాచారం ఇచ్చారు. దీని గురించి మంత్రి ఏమి చెప్పారో తెలుసుకుందాం పదండి…

పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా సజావుగా నిర్వహించడానికి రైల్వే అధికారులు డివిజనల్, జోనల్, రైల్వే బోర్డు స్థాయిల్లో పర్యవేక్షణ చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. “డివిజన్లు, జోన్లు నుంచి సీసీటీవీ కెమెరాల సహాయంతో స్టేషన్లకు వచ్చే ప్రయాణికులను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తున్నాం. ఈ విధానం ప్రయాణికుల రద్దీ నియంత్రణ, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం కీలకంగా ఉంది” అని గురువారం రైల్ భవన్‌లోని వార్ రూమ్‌లో ఆయన మీడియాకు వివరించారు. ఇక రైల్వే బోర్డు వద్ద ఏర్పాటు చేసిన వార్ రూమ్ మూడవ స్థాయిగా రద్దీ పర్యవేక్షణను సమగ్రంగా చూసుకుంటుందన్నారు. మూడు స్థాయిల మానిటరింగ్ వ్యవస్థ ద్వారా, రైల్వే అధికారులు ప్రతి స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యాన్ని, రద్దీ నియంత్రణను జాగ్రత్తగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ వార్ రూమ్ ఏ వెయిటింగ్ ఏరియాలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారో కూడా సమాచారాన్ని అందిస్తుందని మంత్రి చెప్పారు. దీని కారణంగా అటువంటి ప్రదేశాలకు అదనపు రైళ్లను పంపడం సులభం అవుతుంది. వార్ రూమ్ కారణంగా స్థల కొరత ఉన్న స్టేషన్‌లో వేచి ఉండే గదులను కొన్ని గంటల్లోనే పెంచారు. దీనివల్ల ప్రయాణికులకు ప్రయోజనం కలిగింది. ఈ సందర్భంగా, దేశంలోని వివిధ స్టేషన్లలో ప్రస్తుత పరిస్థితిని కూడా మంత్రి వివరించారు. సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న ప్రదేశాలలో తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు వైష్ణవ్ తెలియజేశారు. 

అలాగే పెద్ద స్టేషన్లలో ఒక మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీని కారణంగా దేశంలోని ప్రతి స్టేషన్ పరిస్థితి ఏమిటి? ఎక్కువ రైళ్లు ఎక్కడ ఉన్నాయి? సమస్యలు ఏమిటి? వంటి వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ అయి రైళ్ల నిర్వహణ తేలికవుతుంది.