AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుభకార్యానికి వెళ్లి వస్తున్నారు.. సడెన్‌గా కాలువలోకి దూసుకెళ్లిన కారు!

పాట్నా జిల్లా రాణితలాబ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరయ్య గ్రామం సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కాలువలో పడిపోవడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పాట్నా ఎయిమ్స్‌కు తరలించారు. మృతులు వైశాలి జిల్లాకు చెందినవారు.

శుభకార్యానికి వెళ్లి వస్తున్నారు.. సడెన్‌గా కాలువలోకి దూసుకెళ్లిన కారు!
Car
SN Pasha
|

Updated on: Jul 12, 2025 | 1:48 PM

Share

బీహార్‌లోని పాట్నా జిల్లాలోని పాలిగంజ్ సబ్‌ డివిజన్‌లోని రాణితలాబ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాణితలాబ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సరయ్య గ్రామం సమీపంలో ఒక కారు అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న స్థానిక పరిపాలన బృందం, చుట్టుపక్కల ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జెసిబి సహాయంతో కారును బయటకు తీశారు, కానీ అప్పటికి కారులో ఉన్న ఐదుగురిలో ముగ్గురు చనిపోయారు. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం పాట్నా ఎయిమ్స్‌కు తరలించారు. మృతులను 52 ఏళ్ల నిర్మలా దేవి, 36 ఏళ్ల నీతు సింగ్, 10 ఏళ్ల అస్తితు కుమారిగా గుర్తించారు.

వారంతా వైశాలి జిల్లాలోని మహువా ప్రాంతానికి చెందినవారు. గాయపడిన వారిలో నందన్ సింగ్, రిద్ధి సింగ్ ఉన్నారు, వారు చికిత్స పొందుతున్నారు. సమాచారం ప్రకారం.. వారు ఒకరి వివాహ వార్షికోత్సవంలో పాల్గొనడానికి ఛత్తీస్‌గఢ్ నుండి వైశాలిలోని హాజీపూర్‌కు వెళుతున్నారు. అప్పుడు ఈ ప్రమాదం జరిగింది. సంఘటన గురించి సమాచారం అందగానే, కుటుంబంలో అరుపులు, ఏడుపులు మిన్నంటాయి. కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఈ సంఘటన గురించి ఎస్‌హెచ్‌ఓ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ఉదయం పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సరయ్య గ్రామం సమీపంలో కాలువలో కారు బోల్తా పడిందని పోలీసులకు సమాచారం అందిందని, ఆ తర్వాత స్థానికులు, జెసిబి సహాయంతో పోలీసు బృందం కాలువ నుండి కారును బయటకు తీశారని చెప్పారు. కానీ అప్పటికి కారులో ఉన్న ఐదుగురిలో ముగ్గురు చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారంతా ఛత్తీస్‌గఢ్ నుండి వైశాలికి వెళ్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి