Joshimath: కుంగిపోతున్న జోషిమఠ్‌.. షాకింగ్ ఫోటోలు విడుదల చేసిన ఇస్రో.. మొత్తం కుంగిపోయే ఛాన్స్..!

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌కు సంబంధించి భారత అంతరిక్షణ పరిశోధన సంస్థ ‘ఇస్రో’ షాకింగ్ ఫోటోలను విడుదల చేసింది. జోషిమఠ్ కుంగుబాటు క్రమాన్ని వివరిస్తూ ఫోటోలు రిలీజ్ చేసింది.

Joshimath: కుంగిపోతున్న జోషిమఠ్‌.. షాకింగ్ ఫోటోలు విడుదల చేసిన ఇస్రో.. మొత్తం కుంగిపోయే ఛాన్స్..!
Isro Joshimath
Follow us

|

Updated on: Jan 13, 2023 | 1:24 PM

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌కు సంబంధించి భారత అంతరిక్షణ పరిశోధన సంస్థ ‘ఇస్రో’ షాకింగ్ ఫోటోలను విడుదల చేసింది. జోషిమఠ్ కుంగుబాటు క్రమాన్ని వివరిస్తూ ఫోటోలు రిలీజ్ చేసింది. ఇస్రో విడుదల చేసిన ఫోటోలను జియాలజిస్టులు విశ్లేషించారు. కేవలం 12 రోజుల వ్యవధిలోనే 5.4 సెంటీమీటిర్ల మేర కుంగిపోయినట్లు గుర్తించారు. డిసెంబర్ 27వ తేదీ నుంచి ఈనెల 8వ తేదీ మధ్య 5.4 సెంటిమీటర్లు కుంగిందని, 2022 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో 9 సెంటిమీటర్ల మేర కుంగిపోయినట్లు గుర్తించారు. భవిష్యత్‌తో జోషిమఠ్ పూర్తిగా కుంగిపోయే ప్రమాదం ఉందన్నారు.

మరోవైపు జోషిమఠ్‌లో పగుళ్లు వచ్చిన భవనాల కూల్చివేత ప్రారంభమయ్యింది. తొలుత రెండు హోటళ్లను కూల్చివేస్తున్నారు అధికారులు. హోటల్‌ యాజమానితో పాటు స్థానికులకు నచ్చచెప్పిన తరువాత కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమయ్యింది. పగుళ్లు వచ్చిన భవనాలను కూల్చివేయడానికి 15 రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. బుల్‌డోజర్ల సాయంతో భవనాలను కూల్చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..