AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: అంతా చల్లదనమే ఇక.. తెలుగు రాష్ట్రాల్లో ఫుల్‌గా జోరున వర్షాలు.. ఉరుములు, మెరుపులు

దేశంలో గత కొద్దిరోజుల నుంచి ఎండల తీవ్రత, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. అలాంటి వారికి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించడంతో వాతావరణం చల్లగా మారుతోందని.. వర్షం కురవనుందని వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుందని పేర్కొంది.

Rain Alert: అంతా చల్లదనమే ఇక.. తెలుగు రాష్ట్రాల్లో ఫుల్‌గా జోరున వర్షాలు.. ఉరుములు, మెరుపులు
Rains In Ap And Ts
Ravi Kiran
|

Updated on: Jun 05, 2024 | 9:30 PM

Share

దేశంలో గత కొద్దిరోజుల నుంచి ఎండల తీవ్రత, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. అలాంటి వారికి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించడంతో వాతావరణం చల్లగా మారుతోందని.. వర్షం కురవనుందని వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుందని పేర్కొంది. మరికొన్ని చోట్ల మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతం, గోవా, మహారాష్ట్ర, కోస్తాంధ్ర, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షం కురువనుందని వెల్లడించింది. దక్షిణ మహారాష్ట్ర-కొంకణ్-గోవా తీరంలో 35 కిలోమీటర్ల వేగం నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పశ్చిమ అరేబియా తీర ప్రాంతంలో 55 కిలోమీటర్ల వేగం నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అయితే పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ తూర్పు ప్రాంతం, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనుందని అధికారులు వివరించారు. రాజస్థాన్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్‌లోని గంగానగర్, చురులో వరసగా 45.2, 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హర్యానా సిర్సా, రోహ్ తక్‌లో 45 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది. ఎండల తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.

ఇది చదవండి: ఏపీలో విస్తరిస్తున్న రుతుపవనాలు.. ఆ జిల్లాలకు భారీ వర్షసూచన.. పిడుగులు కూడా..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి