AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌దే.. సమస్యలకు తుది పరిష్కారం అప్పుడేనన్న విదేశాంగ మంత్రి..

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగిస్తే కశ్మీర్‌ సమస్యకు తుది పరిష్కారం లభిస్తుందన్నారు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌. లండన్‌ పర్యటనలో ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు ఆయన కాన్వాయ్‌పై దాడికి ప్రయత్నించడంపై విదేశాంగశాఖ మండిపడింది. తమ దేశంలో ఇలాంటి అరాచకాలు సహించేది లేదని ఖలిస్తాన్‌ వేర్పాటువాదులను..

పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌దే.. సమస్యలకు తుది పరిష్కారం అప్పుడేనన్న విదేశాంగ మంత్రి..
Jai Shankar
Ravi Kiran
|

Updated on: Mar 07, 2025 | 8:55 AM

Share

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగిస్తే కశ్మీర్‌ సమస్యకు తుది పరిష్కారం లభిస్తుందన్నారు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌. లండన్‌ పర్యటనలో ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు ఆయన కాన్వాయ్‌పై దాడికి ప్రయత్నించడంపై విదేశాంగశాఖ మండిపడింది. తమ దేశంలో ఇలాంటి అరాచకాలు సహించేది లేదని ఖలిస్తాన్‌ వేర్పాటువాదులను బ్రిటన్‌ ప్రభుత్వం హెచ్చరించింది. లండన్‌ పర్యటనలో ఒకేసారి అటు ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు , ఇటు కశ్మీర్‌ వేర్పాటువాదులకు ధీటైన సమాధానం ఇచ్చారు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ . కశ్మీర్‌ సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందని ప్రశ్నించిన పాక్‌ జర్నలిస్ట్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. భారత్‌ నుంచి దొంగిలించిన కశ్మీర్ భూభాగాన్ని తిరిగి ఇచ్చినప్పుడే ఈ సమస్యకు తుది పరిష్కారం లభిస్తుందన్నారు.

ఆర్టికల్‌ 370 రద్దు తరువాత జమ్ముకశ్మీర్‌ వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు జైశంకర్‌. అంతేకాకుండా అక్కడ అసెంబ్లీ ఎన్నికలను కూడా విజయవంతంగా ముగించినట్టు చెప్పారు. కశ్మీర్‌ ప్రజలకు ఆర్ధికాభివృద్ది, సామాజిక న్యాయాన్ని అందించినట్టు ప్రకటించారు. జైశంకర్‌ పర్యటన సందర్భంగా లండన్‌లో ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు మళ్లీ రెచ్చిపోయారు. జైశంకర్‌ కాన్వాయ్‌పై దాడికి ప్రయత్నించారు. జైశంకర్‌ కారు ముందు భారత త్రివర్ణ పతాకాన్ని అవమానించారు. ఈ ఘటనపై విదేశాంగశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది . భద్రతా లోపాలు బయటపడ్డాయిని , అరాచకశక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసంది.

లండన్‌ లోని ఛాఠమ్‌ హౌస్‌లో అధికారిక సమావేశాలు ముగించుకున్న జైశంకర్‌ బయటకు వచ్చారు. అదే సమయంలో ఖలిస్థానీ వాదులు అక్కడ ఆందోళన చేపట్టారు. ఖలిస్తాన్‌ జెండాలతో నిరసన తెలిపారు. ఓ దుండగుడు విదేశాంగ మంత్రి కారు వద్దకు దూసుకొచ్చాడు. అతడి చేతిలో భారత జాతీయ జెండా ఉండగా దాన్ని అవమానించేలా ప్రవర్తిస్తూ నినాదాలు చేశాడు. అప్రమత్తమైన లండన్‌ పోలీసులు వెంటనే అతడిని పట్టుకున్నారు. ఖలిస్తాన్‌ అనుకూల వాదులను లండన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బ్రిటన్‌ విదేశాంగశాఖ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. శాంతియుత నిరసనలకు మాత్రమే తమ దేశం అనుమతిస్తుందని , హింసకు పాల్పడితే సహించేది లేదని ఖలిస్తాన్‌ వాదులను బ్రిటన్‌ ప్రభుత్వం హెచ్చరించింది.

బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..