Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆటోడ్రైవర్‌కు రోడ్డు పక్కన కనిపించిన బ్యాగ్.. లోపల ఏముందా అని ఓపెన్ చేయగా

ఈ-రిక్షా డ్రైవర్ తన ఆటోలో ప్రయాణికులను తీసుకెళ్తున్నాడు. ఈ సందర్భంగా టిబ్రారోడ్డు సమీపంలోని చెరువుకట్టపై పడి ఉన్న ఒక బ్యాగును చూశాడు. బ్యాగులో ఏముందోనని చూశాడు.. అందులో కనిపించిన

Viral: ఆటోడ్రైవర్‌కు రోడ్డు పక్కన కనిపించిన బ్యాగ్.. లోపల ఏముందా అని ఓపెన్ చేయగా
E Rickshaw Driver
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 08, 2023 | 8:57 PM

మంగళవారం మోదీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిద్వాయ్ నగర్ నివాసి మహమ్మద్ అనే ఈ-రిక్షా డ్రైవర్ తన ఆటోలో ప్రయాణికులను తీసుకెళ్తున్నాడు. ఈ సందర్భంగా టిబ్రారోడ్డు సమీపంలోని చెరువుకట్టపై పడి ఉన్న ఒక బ్యాగును చూశాడు. బ్యాగులో ఏముందోనని చూశాడు.. అందులో కనిపించిన డబ్బు చూసిన తొలుత ఒకింత షాక్‌ గురయ్యాడు.. ఆ తర్వాత తన స్నేహితుడికి సమాచారం ఇచ్చాడు. అనంతరం వారిద్దరూ కలసి ఈ బ్యాగును తీసుకెళ్లి మోదీ నగర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు బ్యాగును తెరిచి చూడగా అందులో 25 లక్షల రూపాయల విలువైన 500 నోట్ల కట్టలు కనిపించాయి. ఇంత పెద్ద మొత్తంలో బ్యాగ్‌ని డెలివరీ చేసిన డ్రైవర్‌ నిజాయితీని మెచ్చుకుంటూ ఘజియాబాద్‌ రూరల్‌ డీసీపీ రవికుమార్‌ ప్రశంసా పత్రంతో సత్కరించారు.

డ్రైవర్ మహ్మద్ మాట్లాడుతూ.. ఈ బ్యాగ్‌ని మొదట గమనించినప్పుడు ఎవరో బాంబు పెట్టినట్లు అనుమానం వచ్చిందని.. కానీ, దాన్ని తెరిచి చూడగా అందులో డబ్బు కనిపించిందని చెప్పాడు. వెంటనే బ్యాగ్ యజమాని కోసం వెతికే ప్రయత్నం చేశామన్నాడు. కానీ, ఎవరూ కనిపించలేదని.. ప్రయాణికులను ఆటోలో వదిలేసి నా స్నేహితుడి వద్దకు వెళ్లి పోలీసులకు సమాచారం ఇద్దామని అడిగాను.. దాని ప్రకారం పోలీసులకు అప్పగించాం.. నేను పేద కుటుంబానికి చెందిన వాడిని.. డబ్బు విలువ నాకు తెలుసు.. ఆ బాధ కూడా నాకు అర్థం చేసుకోగలనని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

అయితే, ఇంతపెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయిన వ్యక్తులు ఏవరో మాత్రం తెలియలేదని సమాచారం. బ్యాగుకు సంబంధించిన వ్యక్తులేవరూ పోలీసులను సంప్రదించలేదు.. ఉన్నతాధికారులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. ఆదాయపు పన్ను శాఖను పక్క దారిపట్టించేందుకే ఎవరో కావాలనే డబ్బు వదిలేసినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కూడా చాలా చోట్ల ప్రయాణికులు తమ వాహనంలో మరిచిపోయిన డబ్బు, బంగారు ఆభరణాలు ఇచ్చి నిజాయితీని ప్రదర్శించిన ఘటనలు అనేకం ఉన్నాయి. జనవరి 25న షిమోగాలో నాగరాజ్ అనే ఆటో డ్రైవర్ 8 వేల రూపాయలకు పైగా ఉన్న బ్యాగును పోలీసులకు అప్పగించాడు. జనవరి 12వ తేదీన బెంగళూరులో అమెరికా పౌరుడికి సంబంధించిన పాస్‌పోర్టు, వీసా ఉన్న పర్సును ఆటోడ్రైవర్ కిషోర్ పోలీసుల ద్వారా యజమానులకు తిరిగి ఇచ్చాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..