ఖమ్మంకు చెందిన రాకేష్, మాధవి దంపతుల చిన్నారికి గుండె సమస్య ఉందని తెలిసింది. రూ. 14 లక్షల ఖర్చుతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబానికి మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అండగా నిలిచారు. ఆయన కృషితో ఆపరేషన్ విజయవంతమై చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆ కమిషనర్కు కృతజ్ఞతగా తమ బిడ్డకు జెస్విక శ్రీ అని పేరు పెట్టారు.