AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: భారత్‌లో అది పొడవైన రైల్వే మార్గం ఏంటో తెలుసా? 9 రాష్ట్రాలు, 4 వేలకిపైగా కిలోమీటర్లు..

భారతీయ రైల్వేకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిరోజూ లక్షలాది మందిని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న ఇండియన్‌ రైల్వేకు వందల ఏళ్ల చరిత్రి ఉంది. సుమారు 170 ఏళ్ల చరిత్ర ఉన్న ఇండియన్‌ రైల్వే ప్రపంచంలోనే అది..

Indian Railway: భారత్‌లో అది పొడవైన రైల్వే మార్గం ఏంటో తెలుసా? 9 రాష్ట్రాలు, 4 వేలకిపైగా కిలోమీటర్లు..
India's Longest Railway Route
Narender Vaitla
|

Updated on: Oct 19, 2022 | 6:25 AM

Share

భారతీయ రైల్వేకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిరోజూ లక్షలాది మందిని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న ఇండియన్‌ రైల్వేకు వందల ఏళ్ల చరిత్రి ఉంది. సుమారు 170 ఏళ్ల చరిత్ర ఉన్న ఇండియన్‌ రైల్వే ప్రపంచంలోనే అది పెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటిగా పేరుగాంచింది. ప్రతిరోజూ సుమారు 3.43 మిలియన్ల మంది ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటే పోతే ఇండియన్‌ రైల్వేకి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు. అయితే దేశంలో అతి పొడవైన రైల్వే మార్గం ఏంటో తెలుసా.? దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలపై ఓ లుక్కేయండి..

అసోం రాష్ట్రంలోని దిబ్రూఘర్‌ నుంచి కన్యాకుమారి మధ్య ఉన్న రైలు మార్గం దేశంలో అతి పొడవైన రైల్వే మార్గంగా పేరు గాంచింది. సుమారు 55 షెడ్యూల్‌ స్టాప్‌లతో ఈ మార్గం ఉంటుంది. ఈ ట్రాక్‌పై వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణిస్తుంది. దేశంలోని 9 రాష్ట్రాల మీదుగా, సుమారు 80 గంటల 15 నిమిషాల పాటు ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ రైలు ఏకంగా 4,273 కిలోమీటర్లు వెళుతుంది. 2013లో స్వామి వివేకానంద 150 జయంతిని పురస్కరించుకొని వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలను ప్రారంభించారు.

ఈ రైలు టిన్సుకియా, దిమాపూర్, గౌహతి, బొంగైగావ్, అలీపుర్‌దువార్, సిలిగురి, కిషన్‌గంజ్, మాల్దా, రాంపూర్‌హాట్, పాకూర్, దుర్గాపూర్, అసన్‌సోల్, ఖరగ్‌పూర్, బాలాసోర్, కటక్, భువనేశ్వర్, ఖోర్ధా, బ్రహ్మపూర్‌, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రీ, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, వేలూరు, సేలం, ఈరోడ్‌, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం, కొట్టాయం, చెంగన్నూర్, కొల్లాం, తిరువనంతపురం, నాగర్‌కోయిల్ స్టేషన్‌ల మీదుగా కన్యాకుమారు చేరుకుంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
"పేదవారితో ఇళ్లు వేయించి కబ్జా చేస్తున్న వారిని పట్టుకోరా?:"
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!