Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka CM: ‘నేను బ్లాక్‌మెయిల్ చేయను’.. సోనియాగాంధీ నా రోల్‌ మోడల్‌.. డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక విజయం తర్వాత కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాన రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ హైకమాండ్‌తో చర్చలు జరుపుతారు. ముఖ్యమంత్రి పదవి తను మాత్రమే ఇవ్వాలని తాను బ్లాక్‌మెయిల్ చేయనని అంటూనే..

Karnataka CM: ‘నేను బ్లాక్‌మెయిల్ చేయను’.. సోనియాగాంధీ నా రోల్‌ మోడల్‌.. డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు
DK Shivakumar
Follow us
Sanjay Kasula

|

Updated on: May 16, 2023 | 11:41 AM

కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తన ఆరోగ్యం కోలుకుందని, బీపీ కూడా కంట్రోల్‌లో ఉందని, అందుకే ఈరోజు ఢిల్లీకి వస్తున్నానని, ఇక్కడ హైకమాండ్‌ని కలిసే యోచనలో ఉన్నానని చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను ఎవరినీ ఏ పదవి కోసం బ్లాక్ మెయిల్ చేయనని, సోనియా గాంధీయే తనకు రోల్ మోడల్ అని అన్నారు. కాంగ్రెస్ అందరికీ కుటుంబం. మన రాజ్యాంగం చాలా ముఖ్యమైనది కాబట్టి పార్టీలోని ప్రతి ఒక్కరి ప్రయోజనాలను కాపాడాలన్నారు.

కర్ణాటకలో పార్టీ శాసనసభా పక్ష నేతను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం (మే 15) ముగ్గురు పరిశీలకులతో లోతుగా చర్చించారు. అయితే ఎటువంటి నిర్ణయం దొరకలేదు. ఖర్గే, ఇతర పార్టీ సీనియర్ నేతలు ఇవాళ డీకే శివకుమార్‌తో ఈ అంశంపై కూలంకషంగా చర్చించనున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నాయకుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సీనియర్ నేతలు సుశీల్‌కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియాలను పరిశీలకులుగా నియమించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ముగ్గురు సూపర్‌వైజర్లు విడివిడిగా మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకోవాల్సి వచ్చింది. ముగ్గురు సూపర్‌వైజర్లు సోమవారం సాయంత్రం ఖర్గే నివాసానికి చేరుకుని, అనంతరం సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌, ఆ పార్టీ కర్ణాటక ఇన్‌ఛార్జ్‌ రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా కూడా పాల్గొన్నారు.

సమావేశం ముగిసిన అనంతరం సుర్జేవాలా విలేకరులతో మాట్లాడుతూ.. ‘పరిశీలకులు తమ నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడికి సమర్పించారని.. రాష్ట్ర నేతలు, ఇతర పార్టీ సీనియర్ నేతలను సంప్రదించిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటారని’ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్