AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka CM: ‘నేను బ్లాక్‌మెయిల్ చేయను’.. సోనియాగాంధీ నా రోల్‌ మోడల్‌.. డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక విజయం తర్వాత కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాన రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ హైకమాండ్‌తో చర్చలు జరుపుతారు. ముఖ్యమంత్రి పదవి తను మాత్రమే ఇవ్వాలని తాను బ్లాక్‌మెయిల్ చేయనని అంటూనే..

Karnataka CM: ‘నేను బ్లాక్‌మెయిల్ చేయను’.. సోనియాగాంధీ నా రోల్‌ మోడల్‌.. డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు
DK Shivakumar
Sanjay Kasula
|

Updated on: May 16, 2023 | 11:41 AM

Share

కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తన ఆరోగ్యం కోలుకుందని, బీపీ కూడా కంట్రోల్‌లో ఉందని, అందుకే ఈరోజు ఢిల్లీకి వస్తున్నానని, ఇక్కడ హైకమాండ్‌ని కలిసే యోచనలో ఉన్నానని చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను ఎవరినీ ఏ పదవి కోసం బ్లాక్ మెయిల్ చేయనని, సోనియా గాంధీయే తనకు రోల్ మోడల్ అని అన్నారు. కాంగ్రెస్ అందరికీ కుటుంబం. మన రాజ్యాంగం చాలా ముఖ్యమైనది కాబట్టి పార్టీలోని ప్రతి ఒక్కరి ప్రయోజనాలను కాపాడాలన్నారు.

కర్ణాటకలో పార్టీ శాసనసభా పక్ష నేతను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం (మే 15) ముగ్గురు పరిశీలకులతో లోతుగా చర్చించారు. అయితే ఎటువంటి నిర్ణయం దొరకలేదు. ఖర్గే, ఇతర పార్టీ సీనియర్ నేతలు ఇవాళ డీకే శివకుమార్‌తో ఈ అంశంపై కూలంకషంగా చర్చించనున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నాయకుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సీనియర్ నేతలు సుశీల్‌కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియాలను పరిశీలకులుగా నియమించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ముగ్గురు సూపర్‌వైజర్లు విడివిడిగా మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకోవాల్సి వచ్చింది. ముగ్గురు సూపర్‌వైజర్లు సోమవారం సాయంత్రం ఖర్గే నివాసానికి చేరుకుని, అనంతరం సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌, ఆ పార్టీ కర్ణాటక ఇన్‌ఛార్జ్‌ రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా కూడా పాల్గొన్నారు.

సమావేశం ముగిసిన అనంతరం సుర్జేవాలా విలేకరులతో మాట్లాడుతూ.. ‘పరిశీలకులు తమ నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడికి సమర్పించారని.. రాష్ట్ర నేతలు, ఇతర పార్టీ సీనియర్ నేతలను సంప్రదించిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటారని’ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం