AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Power Tariff: వినియోగదారులకు షాకిచ్చిన ఆ ప్రభుత్వం.. పెరిగిన విద్యుత్ ఛార్జీలు

ముందు మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ధరల కారణంగా సామాన్యుడికి బారంగా మారుతోంది. ప్రతిదీ కూడా పెరిగిపోవడంతో ఇబ్బందులు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు పెంచడం మరింత భారంగా మారుతోంది..

Power Tariff: వినియోగదారులకు షాకిచ్చిన ఆ ప్రభుత్వం.. పెరిగిన విద్యుత్ ఛార్జీలు
Power Tariff
Subhash Goud
|

Updated on: May 16, 2023 | 11:28 AM

Share

ముందు మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ధరల కారణంగా సామాన్యుడికి బారంగా మారుతోంది. ప్రతిదీ కూడా పెరిగిపోవడంతో ఇబ్బందులు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు పెంచడం మరింత భారంగా మారుతోంది. ఇక పెరుగుతున్న వేడి మధ్యలో సామాన్య ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గతంతో పోలిస్తే రూ.200 నుంచి 300 వరకు బిల్లు పెరగనుంది. పంజాబ్‌లో విద్యుత్ ధరలు యూనిట్‌కు 25 నుంచి 80 పైసలు పెరిగాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (పీఈఎస్‌ఆర్‌సీ) వివిధ వర్గాల వినియోగదారులకు విద్యుత్ రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది.

మే 16 నుంచి కొత్త రేట్లు

పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు మే 16 నుంచి అమలులోకి వచ్చాయి. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు యూనిట్ విద్యుత్ రేటును 25 నుంచి 80 పైసలకు పెంచాలని నిర్ణయించినట్లు పంజాబ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తెలిపింది. కొత్త రేట్లు మే 16 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ప్రకటన వెలువడిన వెంటనే సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. సవరించిన విద్యుత్ ధరలు సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపబోవని అన్నారు.

ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తోందని, దాని భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. పంజాబ్ ప్రభుత్వం గృహ వినియోగదారులకు, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తోంది. పంజాబ్‌లోని గృహ వినియోగదారులకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కరెంటు రేట్ల పెంపు వల్ల ఆర్థిక భారాన్ని మోపనుంది. అయితే, నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించే దేశీయ వినియోగదారులకు ఇప్పుడు విద్యుత్తు మరింత ఖర్చు అవుతుంది.

ఇవి కూడా చదవండి

అయితే విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రత్యర్థి పార్టీలు వ్యతిరేకించాయి. 100 యూనిట్ల వరకు 2 కిలోవాట్ల గృహ వినియోగదారులకు పిఇఎస్‌ఆర్‌సి విద్యుత్ రేటును రూ.3.49 నుంచి రూ.4.19కి పెంచింది. ఇది కాకుండా 101 నుంచి 300 యూనిట్ల వరకు వినియోగిస్తే కొత్త రేటు యూనిట్‌కు రూ.6.64. మరోవైపు 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగిస్తే ఒక్కో యూనిట్‌కు రూ.7.75 చొప్పున వసూలు చేయనున్నారు. దీంతోపాటు కిలోవాట్‌కు రూ.15 చొప్పున ఫిక్స్‌డ్‌ చార్జీని పెంచారు. ఈ విధంగా, విద్యుత్ ఖర్చు మునుపటి కంటే ఖరీదైనదిగా మారనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి