AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా గాలిపటాలు, దారం అమ్మబోం, ఢిల్లీ వ్యాపారులు

భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో చైనాలో తయారైన గాలిపటాలను, సన్నని గాజు పెంకులతో చేసిన  మాంజాను  (దారాన్ని) అమ్మబోమని ఢిల్లీ లోని లాల్ కౌన్ హోల్ సేల్ వ్యాపారులు..

చైనా గాలిపటాలు, దారం అమ్మబోం, ఢిల్లీ వ్యాపారులు
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Aug 12, 2020 | 5:59 PM

Share

భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో చైనాలో తయారైన గాలిపటాలను, సన్నని గాజు పెంకులతో చేసిన  మాంజాను  (దారాన్ని) అమ్మబోమని ఢిల్లీ లోని లాల్ కౌన్ హోల్ సేల్ వ్యాపారులు నిర్ణయించారు. సాధారణంగా ప్రతి ఏడాదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. అనేక రాష్ట్రాలకు వీటిని ఈ వ్యాపారులు రవాణా చేస్తుంటారు. చైనాలో తయారైన మాంజా తో గాలిపటాలను ఎగురవేసినప్పుడు హానికరమైన, ప్రమాదకరమైన ఆ మాంజా (దారం) మెడకు చుట్టుకుని ఢిల్లీలోనే కొందరు గాయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా దీన్ని కొనేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. కాగా- ఈ సారి  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీటిని తాము విక్రయించబోమని వ్యాపారులు  ప్రకటించారు.

దేశంలోకెలా ఢిల్లీలోని లాల్ కౌన్ హోల్ సేల్ మార్కెట్ అత్యంత ఆకర్షణీయమైన, రంగురంగుల గాలిపటాలకు ప్రసిద్ది. చైనా ఉత్పతులను బాయ్ కాట్ చేయాలన్న పిలుపు కూడా ఊపందుకుంటోంది.