Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు.. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు.. కీలక వ్యక్తుల పేర్లు?
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే సమీర్ మహేంద్రుపై ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పుడు మొత్తం 428 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే సమీర్ మహేంద్రుపై ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పుడు మొత్తం 428 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ. అయితే, తాజాగా ఈడీ వేసిన ఛార్జ్ షీట్లు ఎవరి పేర్లను ప్రస్తావిస్తుందనేది ఉత్కంఠగా మారింది. పలువురు వ్యాపారవేత్తలతో పాటు, రాజకీయ నేతల పేర్లూ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ ఛార్జ్ షీట్లో శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లిపైనే ప్రధాన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే సౌత్గ్రూప్పై స్పెషల్గా ఫోకస్ చేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్లో ఎవరి ప్రస్తావన తీసుకువచ్చిందనే ఇంట్రస్టింగ్గా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..