సిక్త్ సెన్స్ తేడా కొట్టింది.. ఢిల్లీ తీర్పుపై మ‌నోజ్‌తివారీ రియాక్ష‌న్‌..!

ఢిల్లీలో క‌మ‌లం విక‌సిస్తుంద‌ని త‌న సిక్త్ సెన్స్ చెబుతుందంటూ పోలింగ్‌ రోజు కూడా ధీమా వ్యక్తం చేసిన బీజేపీ ఢిల్లీ అధ్య‌క్షుడు మ‌నోజ్ తివారీ చివ‌రకు ఓట‌మిని అంగీక‌రించారు. పార్టీ కేవ‌లం 7 సీట్ల‌కే ప‌రిమిత‌మైంద‌ని అంగీక‌రిస్తూ, మ‌రోసారి ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకున్న అర‌వింద్ కేజ్రీవాల్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఫ‌లితాలు నిరాశ‌ప‌రిచాయంటూనే.. పార్టీ కేడ‌ర్ స్థైర్యం కోల్పోవ‌ద్ద‌ని ఆయన ధైర్యం చెప్పారు. ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో స‌రికొత్త ట్రెండ్ మొద‌లైంది. కాంగ్రెస్ పార్టీ […]

సిక్త్ సెన్స్ తేడా కొట్టింది.. ఢిల్లీ తీర్పుపై మ‌నోజ్‌తివారీ రియాక్ష‌న్‌..!
Follow us

| Edited By:

Updated on: Feb 11, 2020 | 5:19 PM

ఢిల్లీలో క‌మ‌లం విక‌సిస్తుంద‌ని త‌న సిక్త్ సెన్స్ చెబుతుందంటూ పోలింగ్‌ రోజు కూడా ధీమా వ్యక్తం చేసిన బీజేపీ ఢిల్లీ అధ్య‌క్షుడు మ‌నోజ్ తివారీ చివ‌రకు ఓట‌మిని అంగీక‌రించారు. పార్టీ కేవ‌లం 7 సీట్ల‌కే ప‌రిమిత‌మైంద‌ని అంగీక‌రిస్తూ, మ‌రోసారి ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకున్న అర‌వింద్ కేజ్రీవాల్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఫ‌లితాలు నిరాశ‌ప‌రిచాయంటూనే.. పార్టీ కేడ‌ర్ స్థైర్యం కోల్పోవ‌ద్ద‌ని ఆయన ధైర్యం చెప్పారు.

ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో స‌రికొత్త ట్రెండ్ మొద‌లైంది. కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. రెండు ప్ర‌ధాన ప‌క్షాల మ‌ధ్యే ఇకపై రాజ‌కీయం ఉండ‌బోతోంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కంటే ఈ సారి బీజేపీ ఓట్ల‌శాతం మెరుగుప‌డింది’’ అని అన్నారు. ఇకపై ప‌ర‌స్ప‌ర నింద‌లు ప‌క్క‌న‌పెట్టి ఢిల్లీ అభివృద్ధిపై దృష్టిపెట్టాల‌ని ఈ సందర్భంగా మనోజ్ తివారీ సూచించారు. ‘స‌బ్‌కాసాథ్ స‌బ్‌కా వికాస్’ బీజేపీ నినాద‌మ‌న్న మ‌నోజ్‌ తివారీ…ఆరోప‌ణ‌లు, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు ఎన్నిక‌ల‌ వరకే ప‌రిమిత‌మంటూ చెప్పుకొచ్చారు.

ఢిల్లీలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న ప‌రిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని…ఇక్కడి ప్ర‌జ‌లు తమను గెలిపిస్తారని అంచనా వేసినట్లు ఈ బీజేపీ నేత‌ పేర్కొన్నారు. ఏదేమైనా ఢిల్లీలో 8 శాతం ఓట్లు పెర‌గ‌డం క‌మ‌లం పార్టీకి మంచి సంకేతామ‌ని తెలిపారు. ఇక సీఏఏకి వ్య‌తిరేకంగా షాహిన్‌భాగ్‌లో సాగుతున్న నిర‌స‌న‌లపై మాట్లాడిన మనోజ్ తివారీ.. ప్ర‌జ‌ల‌ను నెల‌ల‌ త‌ర‌బ‌డి ఇబ్బందుల‌కు గురిచేసేలా ర‌హ‌దారుల దిగ్బంధ‌నం స‌రికాద‌న్నారు. 11 త‌ర్వాత షాహిన్‌భాగ్ ఖాళీ అవుతుంద‌న్న త‌న వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇస్తూ…నిర‌స‌న‌కారుల్ని స‌ముదాయించి ఆందోళ‌న‌లు విర‌మింపజేయించాల్సిన బాధ్య‌త కేజ్రీవాల్‌పై ఉంద‌ని వెల్లడించారు. ఇదిలా ఉంటే మనోజ్ తివారీ సిక్స్ సెన్స్‌పై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. తివారీని టార్గెట్‌ చేస్తూ పలువురు నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు.

https://twitter.com/itsMrShrivastav/status/1227159428996059136

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!