Lockdown in Madhya Pradesh: కరోనా వైరస్ ఎఫెక్ట్.. మధ్యప్రదేశ్‌లోని మూడు నగరాల్లో లాక్‌డౌన్ విధించిన సర్కార్..

Lockdown in Madhya Pradesh: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌, గుజరాత్..

Lockdown in Madhya Pradesh: కరోనా వైరస్ ఎఫెక్ట్.. మధ్యప్రదేశ్‌లోని మూడు నగరాల్లో లాక్‌డౌన్ విధించిన సర్కార్..
Night Curfew in Telangana
Follow us

|

Updated on: Mar 20, 2021 | 1:56 PM

Lockdown in Madhya Pradesh: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌, గుజరాత్, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందస్తుగా అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడికి ముందస్తు చర్యలుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాజధాని భోపాల్, ఇండోర్, జబల్పూర్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించింది. ఈ మూడు నగరాల్లో శనివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే.. ఈ నగరాల్లోని స్కూళ్లు, కాలేజీలను మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఈ క్రమంలో కొన్ని కఠిన నిబంధనలు కూడా విధించారు. మార్చి 20వ తేదీ నుంచి మహారాష్ట్రకు వెళ్లే బస్సులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మార్కెట్లను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. టీకా లబ్ధిదారుల సంఖ్యను రోజుకు 5 లక్షలకు పెంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

కాగా, మధ్యప్రదేశ్‌లో శుక్రవారం ఒక్క రోజు 1,140 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,73,097 లకు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6600 కి పైగా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా కారణంగా రాష్ట్రంలో శుక్రవారం నాడు ఏడుగురు మృత్యువాత పడ్డారు. కరోనా మహమ్మారి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,901 మంది మరణించినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా నమోదైన కేసుల్లో ఇండోర్‌ (309 కేసులు), భోపాల్ (272 కేసులు), జబల్పూర్ (97 కేసులు) చొప్పున ఉన్నాయి. ఈ నగరాల్లోనే కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నగరాల్లో లాక్‌డౌన్ విధించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అలర్ట్‌గా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. భౌతిక దూరం పాటించడంతో పాటు.. నిరంతరం మాస్క్ ధరించాలని సూచించింది.

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ లైవ్ కింది వీడియోలో చూడొచ్చు..

Also read:

హిందూపురం పట్టణ శివారులో హిజ్రా దారుణ హత్య.. గోంతు కోసి.. డిజీల్ పోసి నిప్పటించారు

Telangana Budget: దేశానికే ఆదర్శంగా టీఎస్ బీ-పాస్‌.. ఆ ఇళ్లకు ఎలాంటి అనుమతి అవసరం లేదు -మంత్రి కేటీఆర్ ‌

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు