G-20 Summit: జీ20 సదస్సుపై నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం.. తెలుగు రాష్ట్రాల సీఎంలు డుమ్మా?
G20 Presidency: వచ్చే ఏడాదికి జీ-20 అధ్యక్ష పదవిని భారతదేశం దక్కించుకుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో నేడు సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
డిసెంబర్ 1, 2022 నుంచి వచ్చే ఏడాది పాటు జీ-20 అధ్యక్ష పదవిని భారతదేశం దక్కించుకుంది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సమావేశాన్ని పిలిచింది. ఈ సమావేశానికి రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించారు. ముందుకు వెళ్లే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, సోమవారం రాష్ట్రపతి భవన్లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నారు. త్వరలో జరిగే సమావేశానికి వీరంతా హాజరవుతారు.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), బీజేపీల మధ్య కొనసాగుతున్న ఉత్కంఠ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
సీఎం కేసీఆర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువే..
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఏఎన్ఐతో మాట్లాడుతూ.. నేను వ్యక్తిగతంగా నేతలందరితోనూ, పార్టీ అధ్యక్షులతోనూ మాట్లాడాను. అయితే ఇప్పటి వరకు కేసీఆర్ సహా కొందరు నేతల నుంచి సమ్మతి రాలేదు. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షులను మాత్రమే పిలిచామని, అందుకే హాజరుకావాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. చైర్పర్సన్లకు బదులు ఇతర ప్రతినిధులెవరూ హాజరుకాకూడదని ఆయన తెలిపారు.
మాకు సమాచారం లేదంటోన్న టీఆర్ఎస్ నేతలు..
దీనిపై టీఆర్ఎస్ నేత కె.కేశవరావు స్పందిస్తూ.. మా నాయకుడు సభకు హాజరవుతారనే సమాచారం ఇప్పటి వరకు లేదన్నారు. సింగపూర్లో చికిత్స పొందుతున్నందున ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఈ సమావేశానికి హాజరుకావడం లేదు. ఈ సమావేశానికి జనతాదళ్ యునైటెడ్ ప్రెసిడెంట్ నితీష్ కుమార్ కూడా హాజరయ్యే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా..
దీంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం నాటి సమావేశానికి హాజరు కాకపోవడంపై ఇప్పటికే కేంద్రానికి సమాచారం అందించారు. దేశ రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నందున ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కాలేకపోతున్నామని వైఎస్ఆర్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఏఎన్ఐతో అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..