AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhattisgarh: నారాయణపూర్‌లో ఎన్‌కౌంటర్, 3 మహిళా నక్సలైట్లు మృతి, భారీ ఆయుధాలు లభ్యం

నారాయణపూర్ ప్రాంతంలో నక్సలైట్ల ఉనికి గురించి సైనికులకు సమాచారం అందింది. ఆ తర్వాత అక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సమాచారం సరైనదని తేలింది. ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళా నక్సలైట్లు ఆయుధాలతో సంచరిస్తూ కనిపించారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో సైనికులకు ఎటువంటి హాని జరగలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారు.

Chhattisgarh: నారాయణపూర్‌లో ఎన్‌కౌంటర్, 3 మహిళా నక్సలైట్లు మృతి, భారీ ఆయుధాలు లభ్యం
Female Naxalites Killed
Surya Kala
|

Updated on: Aug 29, 2024 | 6:18 PM

Share

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మళ్ళీ తుపాకులు మ్రోగాయి. ముగ్గురు మహిళా నక్సలైట్లను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా తెలియజేశారు. హతమైన మహిళా నక్సలైట్ల నుంచి అనేక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం ప్రకారం ప్రస్తుతం సంఘటనా స్థలం సమీప ప్రాంతలో సైనికుల బృందం పెట్రోలింగ్‌లో ఉంది. ఈ సమయంలో సైనికులు ముగ్గురు మహిళా నక్సలైట్‌లను చూశారు. ఈ సందర్భంగా సైనికులకు, నక్సలైట్స్ మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్స్ అక్కడికక్కడే మరణించారు.

నారాయణపూర్ ప్రాంతంలో నక్సలైట్ల ఉనికి గురించి సైనికులకు సమాచారం అందింది. ఆ తర్వాత అక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సమాచారం సరైనదని తేలింది. ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళా నక్సలైట్లు ఆయుధాలతో సంచరిస్తూ కనిపించారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో సైనికులకు ఎటువంటి హాని జరగలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారు.

యూనిఫాంలో ఉన్న మహిళా నక్సలైట్

ఇవి కూడా చదవండి

నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని అబుజ్మద్‌లో హతమైన మహిళా నక్సలైట్లు యూనిఫాం ధరించి ఉన్నారు. సెర్చ్ ఆపరేషన్ కోసం సైనికులు ఆ ప్రాంతానికి వెళ్లగా, నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు. అనంతరం సైనికులు ప్రతీకార చర్యలు చేపట్టారు. చాలా సేపు అడపాదడపా కాల్పులు జరిగాయి, తరువాత ముగ్గురు మహిళా నక్సలైట్లు మరణించారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్లు చేసేందుకు వెళ్లిన బృందాల్లో (DRG), STF, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది ఉన్నారు. మరికొందరు నక్సలైట్ల కోసం కూడా గాలిస్తున్నారు. నక్సలైట్ల విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా ఒక భారీ ప్రకటన చేశారు. 2025 నాటికి దేశం నుంచి నక్సలైట్లను అంతమొందిస్తామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..