AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India: పెను ప్రమాదాన్ని తప్పించిన పైలట్ సమయస్ఫూర్తి.. ఊపిరి తీసుకున్న 429 మంది ఎయిర్ ఇండియా ప్రయాణీకులు.. ఏమైందంటే..

పైలట్‌ సమయస్ఫూర్తి, తెలివితేటలతో తమిళనాడులో గురువారం పెను ప్రమాదం తప్పింది. నిజానికి ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. విమానంలో 429 మంది ఉన్నారు.

Air India: పెను ప్రమాదాన్ని తప్పించిన పైలట్ సమయస్ఫూర్తి.. ఊపిరి తీసుకున్న 429 మంది ఎయిర్ ఇండియా ప్రయాణీకులు.. ఏమైందంటే..
Air India
Follow us
KVD Varma

|

Updated on: Nov 11, 2021 | 9:17 PM

Air India: పైలట్‌ సమయస్ఫూర్తి, తెలివితేటలతో తమిళనాడులో గురువారం పెను ప్రమాదం తప్పింది. నిజానికి ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. విమానంలో 429 మంది ఉన్నారు. చెన్నై విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుండగా, రన్‌వే మొత్తం నీటితో నిండిపోయిందని పైలట్ అకస్మాత్తుగా 50 మీటర్ల దూరం నుంచి గమనించాడు. పైలట్, కో పైలట్ వెంటనే విమానం ల్యాండింగ్‌ను వాయిదా వేసి హైదరాబాద్ వైపు మళ్లించారు. పైలట్ అవగాహనతో పెను ప్రమాదం తప్పింది. పైలట్ ఆకస్మిక నిర్ణయాన్ని ప్రయాణికులు ప్రశంసించారు , మొదట ప్రయాణీకులు ఆశ్చర్యపోయారు, అయితే మొత్తం సంఘటన గురించి వారికి తెలియగానే, వారు విమానం పైలట్, కెప్టెన్ మహపాత్ర మరియు కో-పైలట్ రాజా పొన్నుస్వామిని ప్రశంసించారు.

ఒక ప్రయాణీకుడు R రాజగోపాలన్ ఇలా వ్రాశాడు – స్మార్ట్ పైలట్ కెప్టెన్ మహపాత్ర, కో-పైలట్ రాజా పొన్నుస్వామి అవగాహన కారణంగా, చెన్నై విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ట్యాగ్ చేస్తూ ఆయన ప్రశంసించారు.

ఆయన చేసిన ట్వీట్ ఇదీ..

గత వారం రోజులుగా తమిళనాడు సహా 3 రాష్ట్రాల్లో వర్షాలు..

తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలోని కొన్ని జిల్లాల్లో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సందుల నుంచి విమానాశ్రయం, నివాస ప్రాంతాల వరకు రోడ్డుపై నీరు చేరిన పరిస్థితి. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్(NDRF), ఎస్డీఆర్ఎఫ్(SDRF) బృందాలు నిరంతరం రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. 14 మందికి పైగా మరణించగా, చాలా మంది తప్పిపోయినట్లు కూడా తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయాన్ని గురువారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేశారు. దీని కారణంగా అనేక షెడ్యూల్డ్ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని రద్దయ్యాయనే వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి.

తమిళనాడులోని 20 జిల్లాల్లో రెడ్ అలర్ట్ తమిళనాడులో భారీ వర్షాల కారణంగా 20 జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో చెన్నై, తిరువళ్లూరు, రాణిపేట్, వెల్లూరు, సేలం, కళ్లకురిచి, తిరుపత్తూరు మరియు తిరువణ్ణామలై ఉన్నాయి. వీటిలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో 20.4 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా, ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్చేరిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

6 జిల్లాల్లో వరద హెచ్చరిక

నవంబర్ 11న కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తూత్తుకుడి, విల్లిపురం, తిరునల్వేలి, నాగపట్నం, కడలూరు, చెంగల్‌పేట జిల్లాలకు తమిళనాడు విపత్తు నిర్వహణ అథారిటీ వరద హెచ్చరికలు జారీ చేసింది . వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పేట్‌, కడలూరు, నాగపట్నం, తంజావూరు, తిరువారూరు, మైలాడుతురై జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు నవంబర్‌ 12న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి: Air Bags for Bikes: బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి.. ఇది ఎలా పనిచేస్తుందంటే..

Afghanistan Crisis: అందరి కృషితోనే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో శాంతి సాధ్యం అవుతుంది.. జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఏకాభిప్రాయం!

Air Pollution: కాలుష్యం మహిళా కార్మికుల జీవితాలను కాటేస్తోంది.. అక్కడ 50 శాతం పెరిగిన ఊపిరితిత్తుల రోగాలు!