AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers Protest: రైతు ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి.. వారి ప్రభావం నుండి బయటకు వస్తేగానీ అంటూ..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

Farmers Protest: రైతు ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి.. వారి ప్రభావం నుండి బయటకు వస్తేగానీ అంటూ..
Shiva Prajapati
|

Updated on: Dec 12, 2020 | 8:06 PM

Share

Farmers Protest: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. శనివారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతు సంఘాలు మావోయిస్టుల ప్రభావం నుండి విముక్తి పొందాలని వ్యాఖ్యానించారు. మావోల ప్రభావం నుండి రైతులు బయటకు వస్తేగానీ, చట్టాలు దేశ ప్రయోజనాలకు లోబడి ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకుంటారని అన్నారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం 24 గంటలూ సంసిద్ధంగా ఉందన్నారు. నూతన చట్టాలపై రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పియూష్ గోయల్ పునరుద్ఘాటించారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 17 రోజులుగా రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. వీరి ఆందోళనలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా రైతులతో చర్చలు జరిపింది. అయితే ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో ఏమాత్రం పురోగతి సాధించలేదు. ఫలితంగా రైతులు తమ పోరును ఇంకా కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రైతు ఉద్యమంపై కేంద్ర మంత్రులు రోజుకొకరు చొప్పున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. రైతు ఉద్యమం వెనుక పాకిస్తాన్, చైనా ప్రభావం ఉందని ఒక మంత్రి అంటే.. మావోయిస్టులే రైతులను నడిపిస్తున్నారంటూ మరొక  మంత్రి అంటూ రైతుల ఉద్యమాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు.

Follow Us
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!