AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers Protest: రైతు ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి.. వారి ప్రభావం నుండి బయటకు వస్తేగానీ అంటూ..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

Farmers Protest: రైతు ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి.. వారి ప్రభావం నుండి బయటకు వస్తేగానీ అంటూ..
Shiva Prajapati
|

Updated on: Dec 12, 2020 | 8:06 PM

Share

Farmers Protest: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. శనివారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతు సంఘాలు మావోయిస్టుల ప్రభావం నుండి విముక్తి పొందాలని వ్యాఖ్యానించారు. మావోల ప్రభావం నుండి రైతులు బయటకు వస్తేగానీ, చట్టాలు దేశ ప్రయోజనాలకు లోబడి ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకుంటారని అన్నారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం 24 గంటలూ సంసిద్ధంగా ఉందన్నారు. నూతన చట్టాలపై రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పియూష్ గోయల్ పునరుద్ఘాటించారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 17 రోజులుగా రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. వీరి ఆందోళనలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా రైతులతో చర్చలు జరిపింది. అయితే ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో ఏమాత్రం పురోగతి సాధించలేదు. ఫలితంగా రైతులు తమ పోరును ఇంకా కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రైతు ఉద్యమంపై కేంద్ర మంత్రులు రోజుకొకరు చొప్పున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. రైతు ఉద్యమం వెనుక పాకిస్తాన్, చైనా ప్రభావం ఉందని ఒక మంత్రి అంటే.. మావోయిస్టులే రైతులను నడిపిస్తున్నారంటూ మరొక  మంత్రి అంటూ రైతుల ఉద్యమాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?