కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొనాల్సిందే ! కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ హితవు

దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతుండడంతో ..ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చలు జరిపి ఓ జాతీయ వ్యూహాన్ని రూపొందించాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సూచించారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొనాల్సిందే ! కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ హితవు
Congress Chief Sonia Gandhi
Follow us

| Edited By: Phani CH

Updated on: May 01, 2021 | 5:27 PM

దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతుండడంతో ..ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చలు జరిపి ఓ జాతీయ వ్యూహాన్ని రూపొందించాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సూచించారు. కేంద్రంతో బాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేల్కొనాలని, తమ బాధ్యతలను నెరవేర్చాలని ఆమె అన్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేస్తూ… ఇప్పటికే సమయం మించిపోయిందని, ఇక జాప్యం చేయరాదని అన్నారు. వలస కూలీల వలసలను ఆపాలని, సంక్షోభం ముగిసేవరకు వారికి కనీసం 6 వేలరూపాయలను వారి ఖాతాలలో జమ చేయాలని సోనియా అన్నారు.  5 నిముషాల ఈ వీడియోను తమ పార్టీ ట్విటర్ లో షేర్ చేశారు. దేశ ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని, దేశ వ్యాప్తంగా టెస్టింగ్ చేపట్టాలని, యుధ్ధ ప్రాతిపదికన ఆక్సిజన్, ఇతర వనరులను ఏర్పాటు చేయాలన్నారు.  వ్యాక్సిన్ కవరేజీని పెంచడానికి వ్యాక్సిన్ లైసెన్స్ ను తప్పనిసరి చేయాలి….ప్రాణాధార మందుల బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టాలి.. అని సోనియా కోరారు. ప్రతి రోజు లక్షల మంది కోవిడ్ కి గురవుతున్నారని, వేలమంది మరణిస్తున్నారని పేర్కొన్న ఆమె.. ఇది మనకు పరీక్షాకాలమని అన్నారు. ఈ తరుణంలో అందరం కలిసి ఈ మహమ్మారి అదుపునకు కృషి చేద్దాం అని అన్నారు.

గంటల తరబడి కోవిడ్ రోగులకు సేవలు చేస్తున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లందరికీ తలవంచుతున్నానని సోనియా అన్నారు. గతంలో మన దేశం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని అధిగమించిందని, ఇప్పుడు కోవిద్ పై పోరులో  తమ పార్టీ కేంద్రానికి సహకరిస్తుందని సోనియా గాంధీ వెల్లడించారు. ఢిల్లీలోని వివిధ ఆసుపత్రులకు ఇంకా ఆక్సిజన్ అందలేదని తెలుస్తోందని,  ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని దీన్ని తీర్చాలన్నారు.  యుధ్ధ ప్రాతిపదికన  ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆమె సూచించారు. లోగడ కూడా సోనియా ఇలాగే వీడియో ద్వారా ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన విషయం గమనార్హం.

మరిన్ని ఇక్కడ చూడండి: Air Lift: బోయింగ్ 737 విమానం.. ఒక్కడే ప్రయాణీకుడు..4 వేల కిలోమీటర్లు..ఎందుకంటే

టీకా వేసుకున్నాక మద్యానికి దూరంగా ఉండాలా..? ఒకవేళ తాగితే కలిగే దుష్పరిణామాలు ఏంటి..! తెలుసుకోండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..