AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manish Sisodia: సిసోడియా అరెస్ట్‌ను ఖండిస్తూ ప్రధాని మోదీకి విపక్షాల లేఖ..

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్‌ను ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి విపక్షాలు లేఖ రాశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి సహా 9 మంది విపక్ష నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు.

Manish Sisodia: సిసోడియా అరెస్ట్‌ను ఖండిస్తూ ప్రధాని మోదీకి విపక్షాల లేఖ..
Pm Modi
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 05, 2023 | 11:02 AM

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్‌ను ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి విపక్షాలు లేఖ రాశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి సహా 9 మంది విపక్ష నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నేతలు. ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు నిరంకుశత్వమని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని లేఖ రాసిన వారిలో సీఎంలు, మాజీ సీఎంలు, ముఖ్య నేతలు ఉన్నారు.

ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ బీజేపీ పాలనా విధానాలను తూర్పారబట్టారు. అంతేకాదు.. విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయడం, బీజేపీలో చేరగానే ఆ కేసులను నీరుగార్చడం జరుగుతోందని విమర్శించారు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మను ఉదాహరణగా పేర్కొంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడం, ఆపై క్లిన్‌చిట్ ఇస్తున్నట్లు లేఖలో తూర్పారబట్టారు.

గవర్నర్ వ్యవస్థపైనా విమర్శలు..

ఈ లేఖలో విపక్ష నేతలు గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగంపైనా సంచలన ఆరోపణలు చేశారు. గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకుని, ప్రభుత్వాలను పరిపాలన చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతిష్ట మసకబారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

బీజేపీ ఏం సమాధానం చెబుతుంది?

కాగా, ఈ లేఖపై బీజేపీ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. ఈ లేఖపై బీజేపీ ఎలా స్పందిస్తుంది? ఈ లేఖకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బీజేపీ ఏం సమాధానం చెబుతుందనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

ఈ నేతల సంతకాలు..

ఈ లేఖపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సంతకాలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

అప్పట్లో ఊపేసిన శాంతా భాయ్ గుర్తుందా.?
అప్పట్లో ఊపేసిన శాంతా భాయ్ గుర్తుందా.?
సారాతో బ్రేకప్ పుకార్లు.. ఎట్టకేలకు మౌనం వీడిన గిల్.. ఏమన్నాడంటే?
సారాతో బ్రేకప్ పుకార్లు.. ఎట్టకేలకు మౌనం వీడిన గిల్.. ఏమన్నాడంటే?
దారులన్నీ ఓరుగల్లు వైపే.. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..
దారులన్నీ ఓరుగల్లు వైపే.. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..
ఉత్తమ స్త్రీ లక్షణాలు ఇవే.. వీరుకుటుంబానికి దిశానిర్దేశం చేస్తారట
ఉత్తమ స్త్రీ లక్షణాలు ఇవే.. వీరుకుటుంబానికి దిశానిర్దేశం చేస్తారట
చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చారనీ.. తల్లిదండ్రులను చంపిన కొడుకు..!
చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చారనీ.. తల్లిదండ్రులను చంపిన కొడుకు..!
ముంబైతో లక్నో.. ఢిల్లీతో బెంగళూరు.. సూపర్ సండేలో హోరాహోరీ పక్కా
ముంబైతో లక్నో.. ఢిల్లీతో బెంగళూరు.. సూపర్ సండేలో హోరాహోరీ పక్కా
శ్రీవారి భక్తులకు ప్రసాదం విక్రయం మొదలు పెట్టారో తెలుసా..
శ్రీవారి భక్తులకు ప్రసాదం విక్రయం మొదలు పెట్టారో తెలుసా..
రేపట్నుంచి RRB రాతపరీక్షలు షురూ..హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ లింక్ ఇదే
రేపట్నుంచి RRB రాతపరీక్షలు షురూ..హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ లింక్ ఇదే
నేటి మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలి.. ఎందుకంటే
నేటి మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలి.. ఎందుకంటే
అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ధర ఎంత ఉందంటే..
అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ధర ఎంత ఉందంటే..