AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బార్‌లో తాగి గట్టిగా వాగుతుంటే.. మెల్లిగా మాట్లాడమన్న యువకుడు! ఇంటికొచ్చి భార్య ముందే..

కర్ణాటకలోని బన్నేర్‌ఘట్టలో ఒక యువకుడు గట్టిగా మాట్లాడుతున్న వారిని మెల్లగా మాట్లాడమని అడగడంతో, అతనిని దారుణంగా హత్య చేశారు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్య కేసులో ఒక బాలుడు కూడా నిందితుడిగా ఉన్నాడు. మరొక నిందితుడి కోసం గాలిస్తున్నారు.

బార్‌లో తాగి గట్టిగా వాగుతుంటే.. మెల్లిగా మాట్లాడమన్న యువకుడు! ఇంటికొచ్చి భార్య ముందే..
Karnataka Case
SN Pasha
|

Updated on: Apr 27, 2025 | 6:50 PM

Share

కాస్త మెల్లిగా మాట్లాడుకోండి అన్న పాపానికి ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బన్నేర్‌ఘట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ కేసులో ఓ బాలుడితో సహా నలుగురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. కెంచగయ్యనదొడ్డి వాసి కాంతికుమార్ అలియాస్ సైకో కాంతి (27), గోపాల్ అలియాస్ గొబ్బు రాజా (40), కిరణ్ కుమార్ అలియాస్ సఫీన్స్ (28), ఒక బాలుడిని అరెస్టు చేశారు. మరో నిందితుడు వినోద్ (30) కోసం పోలీసులు గాలిస్తున్నారు.

షానుబోగనహళ్లిలోని తరంగిణి బార్‌లో నిందితులు తాగి గట్టి గట్టిగా మాట్లాడుకుంటున్నారు. దీంతో సురేష్‌ అనే కుర్రాడు అంత గట్టిగా మాట్లాడవద్దని, కాస్త మెల్లిగా మాట్లాడమని కోరాడు. అప్పుడు సైలెంట్‌గా ఉన్న నిందితులు.. సురేష్‌ను ఫాలో అయి అతని ఇంటికి వెళ్లి అతని భార్య, పిల్లల ముందే అతన్ని కత్తితో పొడిచి చంపారు. అతన్ని చంపి, అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదుతో బన్నేరుఘట్ట పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..