AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కొండపై నుంచి దిగుతుండగా బస్సు బ్రేకులు ఫెయిల్‌! 60 మంది ప్రాణాలు దేవుడిలా రక్షించాడు..

మలే మహదేశ్వర కొండపై తలబెట్ట మలుపు వద్ద KSRTC బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్‌ తెలివిగా చేసిన పనితో 60 మంది ప్రయాణికులు ప్రమాదం నుండి తప్పించుకున్నారు. బ్రేకులు ఫెయిల్ అయిన వెంటనే, డ్రైవర్ బస్సును డివైడర్‌కు ఢీకొట్టి ఆపాడు. ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు.

SN Pasha
|

Updated on: Apr 27, 2025 | 6:36 PM

Share

మహదేశ్వర్ కొండలోని తలబెట్ట మలుపు వద్ద KSRTC బస్సు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. వెంటనే డ్రైవర్ మేల్కొని బస్సును డివైడర్ పైకి పోనిచ్చాడు. దీంతో బస్సు ఆగిపోయింది, అదృష్టవశాత్తూ, బస్సులో ఉన్న 60 మందికి పైగా సురక్షితంగా బయటపడ్డారు. మైసూర్ డిపోకు చెందిన KA 09 F 5311 నంబర్ గల KSRTC బస్సు మలే మహదేశ్వర కొండ నుండి కొల్లేగల్ కు ప్రయాణిస్తోంది. ఈ సమయంలో, మలే మహదేశ్వర్ కొండపై తలబెట్ట మలుపు వద్ద బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. బ్రేకులు ఫెయిల్ అవుతున్నట్లుగా అతను బస్సును డివైడర్ పైకి నడిపాడు. దివైడర్‌ను ఢీ కొని బస్సు ఆగింది. డ్రైవర్ అలా చేయకపోయి ఉంటే.. ఘోర విషాదం చోటు చేసుకునేది అని ప్రయాణికులు అంటున్నారు. దేవుడిలా రక్షించాడంటూ డ్రైవర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..