మంత్రి కుమార్తె పెళ్లి ఖర్చు చూస్తే కళ్లు తేలేస్తారు..  చీర రూ.17 కోట్లు, నగలు రూ.90 కోట్లు, మేకప్‌ ఏకంగా రూ.30 లక్షలు..

వివాహం జీవితంలో ఒక్కసారే వచ్చే మ‌ధుర ఘ‌ట్టం. అందుకే గుర్తుండిపోయేలా అట్టహాసంగా పెళ్లి తంతు జ‌రుపుకోవాలని ప్రతి ఒక్కరూ కలలుకంటారు. పేదవాడు తన స్తోమతకు తగ్గట్టు కాబోయే సతి మెడలో చిన్న పసుపు కొమ్మును తాళిగా కట్టి మురిసిపోతాడు. ధనవంతులు మాత్రం..

మంత్రి కుమార్తె పెళ్లి ఖర్చు చూస్తే కళ్లు తేలేస్తారు..  చీర రూ.17 కోట్లు, నగలు రూ.90 కోట్లు, మేకప్‌ ఏకంగా రూ.30 లక్షలు..
Minister Janardhana Reddy Daughter Marriage
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 22, 2023 | 7:24 PM

వివాహం జీవితంలో ఒక్కసారే వచ్చే మ‌ధుర ఘ‌ట్టం. అందుకే గుర్తుండిపోయేలా అట్టహాసంగా పెళ్లి తంతు జ‌రుపుకోవాలని ప్రతి ఒక్కరూ కలలుకంటారు. పేదవాడు తన స్తోమతకు తగ్గట్టు కాబోయే సతి మెడలో చిన్న పసుపు కొమ్మును తాళిగా కట్టి మురిసిపోతాడు. ధనవంతులు మాత్రం నలుదిక్కులా మారుమ్రోగిపోయేలా.. అందరూ చర్చించుకునేలా అట్టహాసంగా జరుపుకుంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది ఇలా పోటీలుపడిమరీ పెళ్లిళ్లకు ఖర్చులు పెడుతున్నారు. పిండి కొద్ది రొట్టే..అన్నరీతిలో. ఐతే కర్ణాటకు చెందిన ఓ మంత్రి తన కూతురు పెళ్లి చీర, మేకప్‌, నగలకే ఏకంగా రూ.500ల కోట్లు ఖర్చుపెట్టాడు. వినడానికి తేడాగా ఉన్నా వాస్తవం మాత్రం ఇదే. దీంతో దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లివేడుకల్లో మంత్రిగారి కూతురు వివాహ వేడుకకూడా చోటు దక్కించుకుంది.

కర్ణాటక మాజీ మంత్రి జనార్ధన రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం నవంబర్ 6, 2016న జరిగింది. 50 వేల మందికి పైగా అతిథులు ఆహాజరైన ఈ ఐదు రోజుల పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా జరిపించారు. అతిథులకు పంపిన వివాహ ఆహ్వాన పత్రికల్లో ఎల్‌సిడి స్క్రీన్‌లు అమర్చిమరీ ఇచ్చాడు. పెళ్లిపత్రికగా ఇచ్చిన బాక్స్‌లో ఎల్‌సిడి స్క్రీన్ ఉంటుంది. టేప్ విప్పగానే పాట ప్లే అవుతుంది. రెడ్డి కుటుంబం పెళ్లికి అతిథులుగా విచ్చేసిన వారి కోసం 40 విలాసవంతమైన ఎద్దుల బండ్లలో గేటుదాకా స్వాగతం పలికారు. శ్రీకృష్ణదేవరాయ విజయనగరం తరహాలో పెళ్లి మండపాన్ని బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్లు డిజైన్ చేశారు. విందు భోజన ప్రాంతం బళ్లారి గ్రామంలా డిజైన్ చేశారు. అతిథులను తరలించేందుకు దాదాపు 2000 క్యాబ్‌లు, 15 హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు. బెంగళూరులోని ఫైవ్, త్రీ స్టార్ హోటళ్లలో 1,500 విలాసవంతమైన గదులను అతిథుల కోసం ఏర్పాటు చేశారు. వివాహ మండపంలో భద్రత కోసం ఏకంగా 3 వేలమంది పోలీసులను నియమించారు.

మంత్రి జనార్ధన రెడ్డి కుటుంబ సభ్యులందరూ రాజుల వేషధారణలతో కోట్లాది రూపాయల విలువైన బంగారు, డైమండ్‌ నగలు ధరించి వచ్చారు. ఐదు రోజుల పాటు వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెళ్లి ఏర్పాట్లే ఇంత పెద్దగా ఉంటే వధువు కోసం మరెంత ప్రత్యేక ఏర్పాట్లు చేశారో తెలిస్తే నోరెళ్లబెడతారు. పెళ్లిలో బంగారు దారంతో నేసిన రూ.17 కోట్ల విలువైన కాంచీపురం పట్టుచీర వధువు బ్రాహ్మణి ధరించింది. ఇక ఆమె ధరించిన ఆభరణాల విలువ సుమారు రూ.90 కోట్లు. ముంబై నుంచి వచ్చిన స్పెషల్‌ మేకప్‌ ఆర్టిస్టులతో వధువును ముస్తాబు చేయడానికి రూ.30 లక్షలు ఖర్చుచేశారుమరి. మంత్రిగారి కుమార్తె పెళ్లి సంగతులు గత ఏడేళ్ల నుంచి దేశ వ్యాప్తంగా కథలుకథలుగా చర్చించుకుంటున్నారంటే ఇది ఆషామాషీ పెళ్లికాదన్నమాట.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు