AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Elections: ఏడో ఇన్నింగ్స్ కు సిద్ధమైన బీజేపీ.. జోరు కొనసాగుతుందా.. ఆప్, కాంగ్రెస్ లు షాక్ ఇస్తాయా..

గుజరాత్‌లో బీజేపీ వరసగా ఏడో సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. గుజరాత్ ఎన్నికల ప్రచారం అంతా ప్రధాని మోదీ చుట్టే తిరుగుతోంది. గత 20 ఏళ్లలో రాష్ట్రానికి చేసిన పనులే తమను గెలిపిస్తాయని నేతలు చెబుతున్నారు....

Gujarat Elections: ఏడో ఇన్నింగ్స్ కు సిద్ధమైన బీజేపీ.. జోరు కొనసాగుతుందా.. ఆప్, కాంగ్రెస్ లు షాక్ ఇస్తాయా..
Bjp In Guarat Elections
Ganesh Mudavath
|

Updated on: Nov 15, 2022 | 11:57 AM

Share

గుజరాత్‌లో బీజేపీ వరసగా ఏడో సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. గుజరాత్ ఎన్నికల ప్రచారం అంతా ప్రధాని మోదీ చుట్టే తిరుగుతోంది. గత 20 ఏళ్లలో రాష్ట్రానికి చేసిన పనులే తమను గెలిపిస్తాయని నేతలు చెబుతున్నారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్ నిరాకరించింది. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జోక్యం ఎక్కువైందన్న విపక్షాల ప్రచారంతో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ కి ఉన్న బలమైన ఇమేజ్ ఈ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ప్రధాని రాక సందర్భంగా వస్తున్న జనాలను బట్టి చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. అయితే స్థానికంగా మోడీ లేకపోవడంతో రాష్ట్ర స్థాయిలో బలమైన కేడర్ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు ప్రక్షాళన జరిగినప్పటికీ.. బీజేపీ రీసెట్ అవలేకపోయిందని చెబుతున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ ప్రచారం చేస్తున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ పాటిదార్ ఆందోళనపై పలు కామెంట్స్ చేశారు. మోర్బీ విపత్తు తప్ప గుజరాత్‌లో అశాంతి లేదు. రాష్ట్రాన్ని కేంద్రం నియంత్రిస్తున్నదన్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయ యంత్రాంగం ఉన్నప్పటికీ.. ప్రచారం అంతా ప్రధాని మోదీ మార్క్ పైనే ఉంది.

ప్రధాని మోడీ సీఎంగా ఉన్న సమయంలో కేంద్రానికి వ్యతిరేకంగా గుజరాతీ అస్మిత వాదించడమే సాంస్కృతిక అహంకారంగా నిపుణులు చెబుతున్నారు. కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. తమ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కేంద్రాన్ని నడుపుతున్నారని బీజేపీ గుజరాతీ నేతలు గర్విస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఓబీసీ, దళిత, ముస్లిం కలయికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. హిందుత్వానికి వ్యతిరేకంగా, అన్ని మతాలు, కులాలు సమానమేనని ప్రచారం చేస్తోంది. అయితే హిందుత్వం అనేది హిందూమతంలో ఒక సమగ్ర భావజాలంగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది ముస్లిం జనాభాకు మాత్రమే వ్యతిరేకం. రాహుల్ గాంధీ లేకపోవడం కాంగ్రెస్‌కు ప్రయోజనంగా మారింది. ఆయన చేసే ప్రసంగాలు రాజకీయంగా ప్రయోజనం కలిగించడం లేదని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా వివాదాలకు దూరంగా ఉండడం ద్వారా రాజకీయ తప్పిదాలకు దూరంగా ఉంది.

గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిత్వం బలంగా కనిపిస్తోంది. బీజేపీ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయలేకపోయినప్పటికీ మరో ఐదేళ్ల వరకు గుజరాత్‌ను కైవసం చేసుకోకుండా బీజేపీని ఆపలేమనే విషయం అర్థమవుతోంది. ఆప్ బలంగా మారుతున్నా అది సోషల్ మీడియా, పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. 2017 లో వచ్చిన లాభాలను సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. గత మూడేళ్లలో డజనుకు పైగా ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టారు. పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రం వారిని ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఈసారి ఎన్నికలు ద్విముఖంగా ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కి గుజరాత్‌లో అధికారం చేపట్టేంత బలం లేదని స్థానికంగా టాక్. ఆప్ ప్రచారం ఢిల్లీలో పలువురిని ఆకట్టుకుంది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఆప్ జోరుగా ప్రచారం సాగుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం అంతగా ఆకట్టుకోవడం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..