AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్ ఫుల్ ఫోకస్.. ఇవాళ సెంట్రల్ ఎలక్షన్ కమిటీల భేటీ..

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్ హైకమాండ్‌లు.. అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించాయి.. ఇప్పటికే మొదటి జాబితాను విడుదల చేశాయి. ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసిన బీజేపీ హైకమాండ్‌.. రెండో జాబితా కోసం కసరత్తుల్ని ముమ్మరం చేసింది. ఈ రోజు సాయంత్రం జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్ ఫుల్ ఫోకస్.. ఇవాళ సెంట్రల్ ఎలక్షన్ కమిటీల భేటీ..
Bjp Congress
Shaik Madar Saheb
|

Updated on: Mar 11, 2024 | 1:34 PM

Share

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్ హైకమాండ్‌లు.. అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించాయి.. ఇప్పటికే మొదటి జాబితాను విడుదల చేశాయి. ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసిన బీజేపీ హైకమాండ్‌.. రెండో జాబితా కోసం కసరత్తుల్ని ముమ్మరం చేసింది. ఈ రోజు సాయంత్రం జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీలో భారీగా చేరికలు కనిపిస్తున్నాయి.తాజాగా బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీలు నగేష్‌, సీతారాం నాయక్‌, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావ్‌లు కమలం పార్టీలో చేరిపోయారు. దీంతో వీరికి టికెట్స్‌ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు బీబీ పాటిల్‌, రాములు తనయుడు భరత్‌ టికెట్‌ దక్కించుకున్నారు. ఇక ఏపీలో పొత్తులో భాగంగా పోటీ చేసే 6 ఎంపీ సీట్లతో పాటు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కూడా ఇవాళ్టి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఢిల్లీలో ఈ సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ..

ఎన్నో వడపోతలు, కసరత్తుల తర్వాత.. ఫస్ట్‌ జాబితాను రిలీజ్‌ చేసిన కాంగ్రెస్‌ పార్టీ..నెక్స్ట్‌ లిస్ట్‌ను ఫైనల్‌ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. 39 మందితో ఫస్ట్‌ లిస్ట్‌ను రివీల్‌ చేసిన హస్తం పార్టీ..అందులో తెలంగాణ నుండి నలుగురు అభ్యర్థులను ఫైనల్‌ చేసింది. జహీరాబాద్‌ నుంచి సురేష్‌ కుమార్ షెట్కార్‌, మహబూబ్‌నగర్‌ నుంచి వంశీచంద్‌ రెడ్డి, నల్గొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌లను అభ్యర్థులుగా హైకమాండ్‌ నిర్ణయించింది. మిగిలిన 13 స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ సాయంత్రం కాంగ్రెస్ హైకమాండ్‌ సమావేశం కానుంది. అయితే తెలంగాణలో ఆశావహులు లిస్ట్‌ భారీగా ఉండడంతో..ఎవరికి సీటు దక్కుతోందనన్న ఆసక్తి నెలకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..