AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar Massive Fire: మధుబని రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆగి ఉన్న రైలులో మంటలు..!

బీహార్‌లో పెను ప్రమాదం తప్పింది. మధుబని రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం నిలబడి ఉన్న రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి వస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి.

Bihar Massive Fire: మధుబని రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆగి ఉన్న రైలులో మంటలు..!
Rail Fire Accident
Balaraju Goud
|

Updated on: Feb 19, 2022 | 2:03 PM

Share

Massive Fire Breaks in Rail: బీహార్‌(Bihar)లో పెను ప్రమాదం తప్పింది. మధుబని(Madhubani) రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం నిలబడి ఉన్న రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి వస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ ఎక్స్‌ప్రెస్‌(Freedom fighter Express)లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు పెరిగి రైలు దహనం చేయడం ప్రారంభించింది. అదృష్టవశాత్తూ, రైలులో మంటలు చెలరేగినప్పుడు ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే స్టేషన్‌లో ఉన్న వ్యక్తులు, సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం ప్రారంభించారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మూడో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై పార్క్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్ ఎక్స్‌ప్రెస్ బోగీల్లో మంటలు చెలరేగాయి. ఇప్పటి వరకు రెండు కోచ్‌లు కాలిపోయాయని చెబుతున్నారు. కాగా మూడో బోగీ కూడా మంటల్లో చిక్కుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. రైలు రేక్‌ని జైనగర్‌ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితి సమీక్షిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, “శనివారం ఉదయం 09.13 గంటలకు సమస్తిపూర్ డివిజన్‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఖాళీ రైలు కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే చర్యలు తీసుకుని 09:50 గంటలకు మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌లు దర్యాప్తు చేస్తున్నాయి. దీన్ని రైల్వే యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఉన్నత స్థాయి విచారణ జరుపుతామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.

Read Also…. Basthi Dawakhana: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. టిమ్స్‌లో పేదలకు అన్ని రకాల కార్పోరేట్ వైద్యంః హరీష్ రావు