Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: పుణ్య స్నానానికి వెళ్లివస్తండగా ఘోర ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు..!

అతివేగం ఐదుగురి ప్రాణాలు తీసింది. మరో నలుగురు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ముజఫర్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబనిలోని నాలుగు లేన్ల జాతీయ రహదారిలో శనివారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ రైడర్‌ను కాపాడే క్రమంలో అతివేగంతో వెళ్తున్న స్కార్పియో కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది.

Road Accident: పుణ్య స్నానానికి వెళ్లివస్తండగా ఘోర ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు..!
Bihar Road Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 01, 2025 | 8:31 PM

అతివేగం కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. మహాకుంభం నుంచి తిరిగి వస్తున్న స్కార్పియో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. కాగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్కార్పియోలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో స్కార్పియో బైక్ రైడర్‌ను కాపాడుతుండగా ప్రమాదానికి గురైంది. స్కార్పియో వాహనంలో ప్రయాణిస్తున్న వారందరూ నేపాల్ నివాసితులుగా పోలీసులు గుర్తించారు.

అతివేగం కారణంగా ముజఫర్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబనిలోని నాలుగు లేన్లలో శనివారం(ఫిబ్రవరి 1) ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ రైడర్‌ను కాపాడే క్రమంలో అతివేగంతో వెళ్తున్న స్కార్పియో కారు సడన్ బ్రేక్ వేయడంతో రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారిపోయింది. ప్రమాద బాధితులు నేపాల్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికులతో కలసి సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌కేఎంసిహెచ్‌కు తరలించారు. ఎస్పీ రూరల్ విద్యాసాగర్, డీఎస్పీ నగర్ 2 వినీతా సిన్హా తమ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంలో స్కార్పియో ధ్వంసమైంది.

పోలీసుల సమాచారం ప్రకారం, నేపాల్‌లోని మోహతారి ప్రాంతానికి చెందిన తొమ్మిది మంది మహాకుంభంలో స్నానం చేసి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ సమయంలో ఘటన జరిగినప్పుడు కొందరు బాలురు నాలుగు లేన్లలో బైక్‌లపై విన్యాసాలు చేస్తున్నారని స్థానికులు తెలిపారు. అదే సమయంలో, స్కార్పియో అతి వేగంతో ఎదురుగా వచ్చింది. బైక్‌పై వెళ్తున్న బాలురను కాపాడే క్రమంలో స్కార్పియో ముందుగా డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఇది చూసి స్టంట్ చేస్తున్న యువకుడు పారిపోయాడు. స్కార్పియో మూడు నాలుగు సార్లు బోల్తా పడడంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులను అర్చన ఠాకూర్, ఇందూ దేవి, మంతర్ణి దేవి, బాల్ కృష్ణ ఝాగా గుర్తించారు. గాయపడిన వారిలో మనోహర్ ఠాకూర్, సృష్టి ఠాకూర్, కామినీ ఝా, దేవతరణ్ దేవి ఉన్నారు.

నాలుగు లేన్ల జాతీయ రహదారిలో స్కార్పియో ప్రమాదానికి గురైందని డీఎస్పీ వినీతా సిన్హా తెలిపారు. వాహనంలో తొమ్మిది మంది ఉన్నారు. వారిలో ఐదుగురు మరణించారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత శబ్దం విని చుట్టుపక్కల ప్రజలు భయబ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను తరలించి ఆస్పత్రికి తరలించేందుకు ప్రజలు సహకరించారు. SKMCHలో చేరిన నలుగురిలో ఒక చిన్నారి కూడా ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదం సమయంలో వాహనంలోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోకపోవడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..