AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: ఇంటి నిర్మాణానికి డబ్బు డిమాండ్ చేసినా.. వరకట్నం వేధింపులుగా భావించాల్సిందేః సుప్రీంకోర్టు

ఇంటి నిర్మాణానికి డబ్బు డిమాండ్ చేయడం 'వరకట్నం వేధింపులు' గా పరిగణించాల్సి ఉంటుందని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

Supreme Court: ఇంటి నిర్మాణానికి డబ్బు డిమాండ్ చేసినా.. వరకట్నం వేధింపులుగా భావించాల్సిందేః సుప్రీంకోర్టు
Supreme Court
Balaraju Goud
|

Updated on: Jan 12, 2022 | 9:01 AM

Share

Supreme Court on Dowry Case: ఇంటి నిర్మాణానికి డబ్బు డిమాండ్ చేయడం ‘వరకట్నం వేధింపులు’ (Dowry Harassment)గా పరిగణించాల్సి ఉంటుందని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(Justice NV Ramana), జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. కట్నం వేధింపుల కారణంగా ఐదేళ్ల గర్భిణి మరణానికి కారణమైన భర్త, అతని తండ్రికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది ధర్మాసనం.

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 304బి ప్రకారం ఇంటి నిర్మాణానికి డబ్బు డిమాండ్ చేయడం ‘కట్నం వేధింపులు’ అని పేర్కొంది సుప్రీంకోర్టు. వరకట్న హత్య కేసులో ఒక వ్యక్తి, అతని తండ్రి దోషులుగా నిర్ధారించిన కేసులో శిక్షను మంగళవారం సుప్రీంకోర్టు ఖరారు చేసింది. వరకట్న డిమాండ్ అనే సామాజిక దురాచారాన్ని ఎదుర్కొనేందుకు ఐపీసీలోని సెక్షన్ 304-బీ నిబంధన ఆందోళనకర స్థాయికి చేరుకుందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

“కట్నం’ అనే పదాన్ని నిర్వచించే నిబంధన (వరకట్న చట్టం) దృష్ట్యా ఏదైనా రకమైన ఆస్తి లేదా విలువైన వస్తువులను దాని పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇంటి నిర్మాణం కోసం డిమాండ్ చేసిన డబ్బును కట్నం డిమాండ్‌గా పరిగణించలేమని హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం తప్పుబట్టింది. ఈ నిబంధన అసలు లక్ష్యం ఏదీ లేదు. కాబట్టి, మన సమాజంలో లోతుగా పాతుకుపోయిన ఈ దురాచారాన్ని నిర్మూలించే పనిని సాధించడానికి సరైన దిశలో కృషి చేయాల్సిన అవసరం ఉంది ”అని జస్టిస్ కోహ్లి అన్నారు.

ఇదిలావుంటే , మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ‘ఇల్లు. నేరారోపణ, శిక్ష తీర్పును కోర్టు పక్కన పెట్టింది. వరకట్న మరణానికి సంబంధించి భర్త, అత్తమామలను నిర్దోషులుగా ప్రకటించింది హైకోర్టు. బాధితురాలు తన కుటుంబ సభ్యులను ఇంటి నిర్మాణానికి డబ్బు ఇవ్వాలని కోరిందని, దీనిని కట్నం డిమాండ్‌గా పరిగణించలేము అని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పుపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

తన కుటుంబం నుండి డబ్బు తీసుకురావాలని ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నందున ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఐదు నెలల గర్భిణి అయిన మృతురాలు తన మ్యాట్రిమోనియల్ హోమ్‌లో బలవన్మరణానికి పాల్పడింది. అయితే, మృతురాలు స్వయంగా చేసిన డిమాండ్‌ను సరైన కోణంలో చూసి అర్థం చేసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వరకట్న మరణానికి సంబంధించి వారిద్దరినీ దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని పేర్కొంది.

“ఇంటి నిర్మాణం కోసం మరణించిన వ్యక్తి నుండి ప్రతివాదులు సేకరించిన డబ్బు డిమాండ్‌ను ట్రయల్ కోర్టు సరిగ్గానే వ్యాఖ్యానించిందని మేము అభిప్రాయపడుతున్నాము, ఇది వరకట్నం అనే పదం నిర్వచనం పరిధిలోకి వస్తుంది. ప్రతివాదులు చేసిన దానిని చూడకుండా ఉండకూడదు. మరణించిన వ్యక్తిని నిరంతరం హింసించడం, ఇల్లు నిర్మించడానికి డబ్బు కోసం ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించమని వేధించారు. దీంతో ఇంటి నిర్మాణానికి కొంత మొత్తాన్ని కోరవలసి వచ్చింది, ”అని ధర్మాసనం పేర్కొంది. డబ్బులు తీసుకురావల్సిందిగా వేధింపులకు సంబంధించి రికార్డులు కూడా ఉన్నాయని ధర్మాసనం వెల్లడించింది. ఇది సంక్లిష్టమైన కేసు కాదు, అటువంటి ప్రతికూల పరిస్థితులలో మరణించిన వ్యక్తి ఎదుర్కొన్న పూర్తి నిస్సహాయ కేసు” అని వ్యాఖ్యానించింది. సెక్షన్ 304-B ​​మరియు సెక్షన్ 498-A IPC కింద భర్త, అతని తండ్రిని దోషులుగా నిర్ధారించింది ధర్మాసనం. దీంతో సెక్షన్ 304-B ​​IPC ప్రకారం వీరిద్దరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష జైలు శిక్ష విధించింది కోర్టు.

Read Also…  IIT Recruitment: ఐఐటీలో ఆర్ఈవో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. నెల‌కు రూ. 2 ల‌క్ష‌ల‌కుపైగా జీతం పొందే అవ‌కాశం..