AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుజరాత్ లో మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ఇప్పటికే 9 మంది మృతి.. జాగ్ర‌త్త ఉండాలంటున్న వైద్యులు

ముందే కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా వణికిపోతుంటే.. మరో కొత్త కొత్త రోగాలు మరింత భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో భయంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు....

గుజరాత్ లో మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ఇప్పటికే 9 మంది మృతి.. జాగ్ర‌త్త ఉండాలంటున్న వైద్యులు
Subhash Goud
|

Updated on: Dec 18, 2020 | 12:02 PM

Share

ముందే కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా వణికిపోతుంటే.. మరో కొత్త కొత్త రోగాలు మరింత భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో భయంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు.. కొత్తకొత్త వ్యాధులు దరి చేరడంతో మరింత భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో మరో ప్రాణాంతకమైన వ్యాధి బయపడింది. మ్యూకోర్మేకోసిన్ అనే అరుదైన వ్యాధి కారణంగా అహ్మదాబాద్ లో ఇప్పటికే 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 30 మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే గుజరాత్ తో పాటు ముంబాయిలో సైతం ఈ వ్యాధికి సంబంధించిన కేసులు బయటపడుతున్నట్లు తెలుస్తోంది.

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఇప్పటి వరకు 44 మంది ఈ మ్యూకోర్మేకోసిన్ వ్యాధి బారిన పడ్డగా, తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు, మూడు రోజుల కిందట ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో 12 కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఈ వ్యాధిన బారిన పడినవారంతా 50 ఏళ్ల పైబడిన వారే ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిలోనూ ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్ కూడా మ్మూకోర్మైకోసిన్ వ్యాధి గురించి వివరిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.

అలాగే కరోనా బారిన పడిన వారు మ్యూకోర్మైకోసిన్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రాణాంతకమైన వ్యాధి, దీని వల్ల శరీరంలో మెదడుతో పాటు పలు అవయవాలు పని చేయకుండా పోతాయని ముంబాయి, అహ్మదాబాద్ నగరాల్లో ఇప్పటికే ఈ వ్యాధిపై హెచ్చరికలు జారీ చేశారు.. అని రాజస్థాన్ ముఖ్యమంత్రి ట్విటర్ పేర్కొన్నారు.

మ్యూకోర్మైకోసిన్ అంటే ఏమిటీ..? ఈ వ్యాధి పేరు వింతగా అనిపించినా పెద్ద ప్రాణాంతకమేనని తెలుస్తోంది. అత్యంత అరుదుగా ఈ ఫంగస్ అన్ఫెక్షన్ అత్యంత ప్రమాదని నిపుణులు చెబుతున్నారు. మ్యూకోర్మైసెటీస్ అనే శిలీంధ్రం కారణంగా ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకుతుందట. ముందుగ ముక్కు నుంచి మొదలై కళ్లకు సోకుతుంది. వ్యాధిని త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే తప్ప బయట పడలేం. దీని వల్ల కంటి చుట్టూ కండరాలు పని చేయకుండా పోతాయి. ఫలితంగా కంటిచూపు పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ వ్యాధి మెదడుకు చేరితో ఆ రోగి మెదడువాపు బారిన పడతారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

వాటర్ బాటిల్ కడగడం కష్టంగా ఉందా..? ఈ సింపుల్ హాక్ ట్రై చేయండి
వాటర్ బాటిల్ కడగడం కష్టంగా ఉందా..? ఈ సింపుల్ హాక్ ట్రై చేయండి
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. ఉచితంగా కిట్
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. ఉచితంగా కిట్
బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ
బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ
చైనీస్ మాంజానే కాదు.. గల్లీల్లో తయారయ్యే గాజు మాంజాలు డేంజరే..!
చైనీస్ మాంజానే కాదు.. గల్లీల్లో తయారయ్యే గాజు మాంజాలు డేంజరే..!
సిట్రస్ పండ్లతో జాగ్రత్త! ఇలా తింటే డేంజరస్ కాంబినేషన్..!
సిట్రస్ పండ్లతో జాగ్రత్త! ఇలా తింటే డేంజరస్ కాంబినేషన్..!
చలికాలంలో క్యారెట్ తింటే ఏమవుతుంది.. తినేముందు ఇవి పక్కా..
చలికాలంలో క్యారెట్ తింటే ఏమవుతుంది.. తినేముందు ఇవి పక్కా..
భాగ్యనగరం చుట్టి రావాలా? 2 రోజుల్లో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు..
భాగ్యనగరం చుట్టి రావాలా? 2 రోజుల్లో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ కాదండోయ్
అమెరికాలో ఒక కిలో చేదు కాకరకాయ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?
అమెరికాలో ఒక కిలో చేదు కాకరకాయ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?
ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా.. రూ.2653 కోట్లు విడుదల చేసిన..
ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా.. రూ.2653 కోట్లు విడుదల చేసిన..